ఐశ్వర్య రాజేష్‌ సరసన రాహుల్‌ రవీంద్రన్‌

రాహుల్‌ రవీంద్రన్‌ నటుడిగా కొనసాగుతూనే ‘చి ల సౌ’, ‘మన్మథుడు 2’లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన ఐశ్వర్య రాజేష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు.

Published : 23 Mar 2021 14:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రాహుల్‌ రవీంద్రన్‌ నటుడిగా కొనసాగుతూనే ‘చి.ల.సౌ’, ‘మన్మథుడు 2’లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన ఐశ్వర్య రాజేష్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్‌’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్‌ - నిమిషా సజయన్‌ అనే పాత్రలో నటిస్తుండగా ఆమె భర్తగా రాహుల్‌ కనిపించనున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ ట్వీటర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ఈ సినిమాలో నటించడానికి ఎంతో ఆస్తకిగా ఎదురుచూస్తున్నా’’ అంటూ వెల్లడించారు. ఆర్‌ కన్నన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మసాలా పిక్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా సెట్స్ పైకి వెళ్లింది. చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారట.  ప్రస్తుతం రాహుల్‌ రవీంద్రన్‌ తెలుగులో నాని కథానాయకుడిగా నటిస్తోన్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్‌ - పవన్‌ సరసన ‘అయ్యప్పనమ్‌ కోషియం’ రీమేక్‌ చిత్రంలో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని