క్రష్ ఎవరూ లేరు.. ఉన్నా చెప్పను.. ‘రాజ రాజ చోర’ హీరోయిన్ సునయన
తనకు క్రష్ అంటూ ఎవరూ లేరని.. ఉన్నా చెప్పనని, తాను పుట్టి పెరిగింది నాగ్పూర్లో అయినా తెలుగు చక్కగా మాట్లాడగలనని చెప్పుకొచ్చింది ‘నారింజ మిఠాయి’తో గుర్తింపు తెచ్చుకున్న సునయన. శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజరాజ చోర’
ఇంటర్నెట్ డెస్క్: తనకు క్రష్ అంటూ ఎవరూ లేరని.. ఉన్నా చెప్పనని, తాను పుట్టి పెరిగింది నాగ్పూర్లో అయినా తెలుగు చక్కగా మాట్లాడగలనని చెప్పుకొచ్చింది ‘నారింజ మిఠాయి’తో గుర్తింపు తెచ్చుకున్న సునయన. శ్రీవిష్ణు కథానాయకుడిగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజరాజ చోర’ చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సునయన విలేకరులతో ముచ్చటించింది. అందులో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుందామె. అవేంటో ఆమె మాటల్లోనే..
నేను తమిళంలో చాలా సినిమాలు చేస్తున్నాను. అయితే.. తెలుగులో ఒక మంచి సినిమా చేయాలని మొదటి నుంచి నా మనసులో ఉంది. 2019లో నేను చేసిన తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పత్తి’ తెలుగులో ‘నారింజ మిఠాయి’ పేరుతో విడుదలైంది. ఆ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ హసిత్ నన్ను సంప్రదించారు. కథ చెప్పారు. స్క్రిప్టు విన్న తర్వాత నటించే అవకాశం ఉన్న పాత్ర అనిపించడంతో ఓకే చెప్పాను. అలా సినిమాకు ఒప్పుకొన్నాను.
సినిమాలో నా పాత్ర పేరు విద్య. ఆమె లాయర్. నటనా ప్రాధాన్యమున్న సినిమా ఇది. లాయర్ అంటే వాళ్లు బాగా ఆత్మవిశ్వాసంతో గట్టిగా మాట్లాడుతుంటారు. నాకు అలాంటివి రావు. అందుకే ఈ సినిమాలో లాయర్ పాత్ర కావడంతో బాగా ప్రాక్టీస్ చేశాను. డైరెక్టర్ హసిత్తో మాట్లాడాను. రీసెర్చ్ కూడా చేశాను.
* సినిమా పూర్తి కామిక్ చిత్రం. నా పాత్ర మాత్రం సీరియస్ కేరెక్టర్. కుటుంబంతో కలిసి హాయిగా ఆ ఆస్వాదించగలిగే సినిమా.
సెట్లో విష్ణు ఎక్కువగా మాట్లాడరు. మనం వెళ్లి కదిలిస్తేనే మాట్లాడుతారు. బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినిమాలో అనవసరమైన పాటలు లేవు. హసిత్ గురించి చెప్పాలంటే.. ఆయనకు అన్నీ తెలుసని నా అభిప్రాయం. ఏ పని చేసినా ఆయన దగ్గర కనీసం పది కారణాలుంటాయి. బాగా ఆలోచించి ముందడుగు వస్తారు. మనకు రాబోయే మంచి డైరెక్టర్లలో హసిత్ ఒకరు. నేను ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో నాలో ఆత్మవిశ్వాసం పెంచిన డైరెక్టర్.
నేను నాగ్పూర్లో పుట్టి పెరిగాను. తెలుగులో ‘టెన్త్ క్లాస్’ చేశాను. ఆ తర్వాత తమిళంలో ఎక్కువగా అవకాశాలు రావడరంతో అక్కడికి వెళ్లిపోయాను. ఇప్పుడు మళ్లీ తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ సినిమా కథ నా దగ్గరికి వచ్చింది. తెలుగులో సినిమాలు చేస్తున్న కారణంగానే తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నా. దానికి తోడు నేను చేసిన చాలా సినిమాల్లో టెక్నీషియన్లలో తెలుగువాళ్లు ఉంటారు. వాళ్లతో మాట్లాడుతూ ఉండేదాన్ని.
* క్రష్ అంటూ ఎవరూ లేరు. ఉన్నా క్రష్ ఎవరో నేను చెప్పను. అభిమాన హీరో అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అందర్నీ సమానంగా అభిమానిస్తా. ఎందుకంటే వాళ్లంతా ఎంత కష్టపడతారో నాకు తెలుసు.
ఏదో ఒక రకమైన పాత్రలు చేయాలని ఏం లేదు. అన్నిరకాల పాత్రలు చేయాలన్నదే నా లక్ష్యం. తమిళంలో నా సినిమాలను గమనిస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మనకు నచ్చిన పాత్రలే రావాలని ఏం లేదు కదా.! అందుకే ఫలానా పాత్రలు అని ప్రత్యేకంగా లేకుండా.. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఇలా సినిమా ఏదైనా నన్ను నేను నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం. ‘రాజ రాజ చోర’ కూడా నాకు నచ్చిన పాత్రల్లోకి వస్తుంది.
నానిగారు నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’లో నటిస్తున్నాను. హిందీలో ఇంతవరకూ అవకాశం అయితే రాలేదు. నారింజ మిఠాయి చూసి ‘రాజరాజ చోర‘, ‘మీట్ క్యూట్’లో అవకాశం వచ్చింది. ఈ సినిమా అర్థం కావాలంటే మైండ్ పెట్టాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.