వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్ నటి
తన ఏడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్. మోడల్గా కెరీర్ను ప్రారంభించి బుల్లితెర వ్యాఖ్యాత, నటి, డ్యాన్సర్గా బాలీవుడ్తోపాటు, దక్షిణాదిలోనూ...
ప్రేమికుల దినోత్సవం ముందు విడిపోవడం బాధగా ఉంది
ముంబయి: తన ఏడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్. మోడల్గా కెరీర్ను ప్రారంభించి బుల్లితెర వ్యాఖ్యాత, నటి, డ్యాన్సర్గా బాలీవుడ్తోపాటు, దక్షిణాదిలోనూ ప్రేక్షకుల్ని అలరించారు ఈ తార. ఓ ఎన్నారైతో తన వివాహమైందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆమె గతేడాది బిగ్బాస్ షో వేదికగా తన భర్త రితేష్ సింగ్ని మొదటిసారి అందరికీ పరిచయం చేశారు. ఈ నేపథ్యంలోనే రితేష్ నుంచి విడిపోతున్నట్లు ఆదివారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. వాలంటైన్స్ డే ముందు ఇలాంటి ప్రకటన చేయడం ఎంతో బాధగా ఉందని ఆమె తెలిపింది.
‘‘రితేష్, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా దారులు మేం చూసుకోవాలనుకుంటున్నాం. బిగ్బాస్ షో తర్వాత మా జీవితాల్లో ఎన్నో మార్పులు జరిగాయి. కొన్ని విషయాలు నాకు తెలియకుండానే నా చేజారిపోయాయి. మా మధ్య తలెత్తిన విభేదాలను తొలగించుకుని, కలిసి జీవించేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, చివరికి విడిపోవడమే ఉత్తమమైన నిర్ణయం అనిపించింది. వాలంటైన్స్ డే ముందు ఇలా జరగడం నాకెంతో బాధగా ఉంది. రితేష్ మంచి వాడే. అయినప్పటికీ ప్రస్తుతానికి నా దృష్టంతా కెరీర్, జీవితంపైనే పెట్టాలని, సంతోషంగా జీవించాలని ఉంది’’ అని రాఖీ సావంత్ ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!