Ram Charan: నాటు నాటు.. దేశ ప్రజల పాట: రామ్చరణ్
ఆస్కార్ గెలిచిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో కథానాయకుడు రామ్చరణ్(Ram Charan)కి, హైదరాబాద్లో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి(Rajamouli), సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి(Keeravani) కుటుంబ సభ్యులకి అభిమానులు స్వాగతం పలికారు.
ఆస్కార్ గెలిచిన ‘ఆర్ఆర్ఆర్’ బృందానికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. దిల్లీలో కథానాయకుడు రామ్చరణ్(Ram Charan)కి, హైదరాబాద్లో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి(Rajamouli), సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కుటుంబ సభ్యులకి అభిమానులు స్వాగతం పలికారు. ఇటీవల లాస్ ఏంజెలెస్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ బృందం పాల్గొన్న సంగతి తెలిసిందే. కథానాయకుడు ఎన్టీఆర్ ఈ నెల 15నే హైదరాబాద్కి చేరుకున్నారు. రాజమౌళి, కీరవాణి ఇతర బృందం శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్ తిరిగొచ్చారు. మరో కథానాయకుడు రామ్చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి దిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ని చుట్టుముట్టి అభినందనలు తెలిపారు.
* దేశంలోని నలు దిక్కుల ప్రజలు ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) సినిమాని చూడటంతోనే ఇంతటి విజయం సాధ్యమైందన్నారు రామ్చరణ్. ‘నాటు నాటు’ మాది కాదని, ఇది భారతీయులందరి పాట అని, ఆస్కార్ కోసం మాకు అవకాశాన్ని కల్పించిన పాట అన్నారు. దిల్లీ విమానాశ్రయంలో రామ్చరణ్ (ram Charan) విలేకర్లతో మాట్లాడారు. ‘‘మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఎం.ఎం.కీరవాణి, ఎస్.ఎస్.రాజమౌళి, చంద్రబోస్ల విషయంలో గర్వపడుతున్నాం. వారి కారణంగానే మేం రెడ్ కార్పెట్పై నడిచి దేశానికి ఆస్కార్ తీసుకొచ్చాం. ‘నాటు నాటు’ లైవ్ ప్రదర్శనలో డ్యాన్స్ చేయడానికి నేను వందశాతం సిద్ధంగానే ఉన్నాను. కారణం ఏంటో తెలియదు కానీ నాకు ఆహ్వానం రాలేదు. అవన్నీ పక్కనపెడితే వేదికపై ఆ పాటకు డ్యాన్స్ చేసిన బృందం మాత్రం అదరగొట్టేశారు’’ అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు... పాటకి ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.