1484 రోజుల తర్వాత థియేటర్లోకి వస్తోన్న స్టార్ హీరో
నాలుగేళ్ల తరువాత బాలీవుడ్ స్టార్ హీరో వెండితెరపై కనిపించనున్నాడు. ‘సావరియా’తో ఎంట్రీ ఇచ్చి.. ‘రాక్స్టార్’, ‘బన్నాయే హసీనో’, ‘రాక్స్టార్’, ‘యే జవానీ హై దివానీ’ తదితర చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రణ్బీర్.
2018లో ‘సంజూ’ విడుదల.. 2022లో ‘షంషేరా’తో..
ఇంటర్నెట్ డెస్క్: నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో వెండితెరపై కనిపించనున్నాడు. ‘సావరియా’తో ఎంట్రీ ఇచ్చి.. ‘రాక్స్టార్’, ‘యే జవానీ హై దివానీ’ తదితర చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు రణ్బీర్. ఆయన చివరిగా.. 2018లో వచ్చిన సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’లో కనిపించారు. ఇప్పుడు ‘షంషేరా’ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రంతో పలకరించనున్నారు. 1484 రోజుల థియేటర్లో రణ్బీర్ దర్శనమివ్వడం విశేషం. శుక్రవారం ‘షంషేరా’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.‘‘ 2022 జులై 22న లెజెండ్ మన ముందుకు రానున్నాడు. యశ్ రాజ్ నిర్మాణ సంస్థకు ఇది 50వ చిత్రం. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది’’ అంటూ ట్వీట్ చేసింది. వాణీ కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. 2018లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్.. 2020 జనవరిలో ముగిసినా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇదే ఏడాది పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మస్త’తో రణ్బీర్ సందడి చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. ఆలియా భట్, అక్కినేని నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?