CJI Justice Chandrachud: ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తన చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. తన బాల్యాన్ని గుర్తుచేసుకున్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
కాఠ్మాండూ: ప్రస్తుతం పాఠశాలలో చిన్నారులపై ఉపాధ్యాయులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. కానీ, కొన్నేళ్ల క్రితం విద్యనభ్యసించిన వారికి మాత్రం ఇది సాధారణం. ఈ తరహా శిక్ష భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (CJI Justice Chandrachud) కూడా ఎదురైందట. తాను కూడా చిన్నప్పుడు పాఠశాలలో బెత్తం దెబ్బలు తిన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించడం గమనార్హం. ఆ రోజును ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. ‘జువైనల్ జస్టిస్’ (బాలల నేర న్యాయవ్యవస్థ) అంశంపై నేపాల్లో జరుగుతున్న సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.
పిల్లలతో ఉపాధ్యాయుల ప్రవర్తనా విధానం వారి మనసుపై లోతైన ప్రభావం చూపుతుందని.. అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘‘నేను 5వ తరగతి చదువుతున్న రోజుల్లో జరిగిన సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో క్రాఫ్ట్ నేర్చుకుంటున్నా. అసైన్మెంట్ కోసం అవసరమైన సరైన సైజు గల సూదులను తీసుకురాలేదు. ఈ విషయం తెలుసుకుని మా టీచర్ నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తంతో నా చేతిపై బలంగా కొట్టారు. చేతిపై కొట్టకుండా మరెక్కడైనా కొట్టమని ఎంతో వేడుకున్నా. దెబ్బలకు నా కుడి చేయి కందిపోయింది. అవమానంతో 10 రోజుల వరకు చేతిని ఎవరికీ చూపించుకోలేదు’’ అని పంచుకున్నారు.
ప్రజ్వల్ రేవణ్న బాధితులు 500 మంది పైనే?
గాయం నయమైంది. కానీ..
‘‘కొంత కాలం తర్వాత భౌతిక గాయం నయమైంది. కానీ, ఆ సంఘటన నాపై ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటికీ ఏదైనా పని చేస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది’’ అని అన్నారు. చట్టపరమైన సంఘర్షణల్లో చిక్కుకున్న బాలల బలహీనతలు, ప్రత్యేక అవసరాలను గుర్తించాలన్నారు. ముఠాల ద్వారా చిన్నారులు నేర కార్యకలాపాల్లోకి బలవంతంగా వెళ్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దృష్టిలోపం ఉన్న పిల్లలతో వ్యవస్థీకృత నేర బృందాలు ఎలా భిక్షాటన చేయిస్తున్నాయో చూస్తూనే ఉన్నామని.. యుక్తవయసు పిల్లలు, దివ్యాంగులకు కూడా ఈ ముప్పు ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
ఏసీ యూనిట్లో మంటలు చెలరేగడంతో ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన దిల్లీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. -
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను వెల్లడించడంపై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు సూచించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు