Bajrang Punia: డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది.
దిల్లీ: పారిస్ ఒలింపిక్స్కు (Paris Olympics) సిద్ధమవుతోన్న రెజ్లర్ బజరంగ్ పునియా (Bajrang Punia)కు చుక్కెదురయ్యింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా ఆయనపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో మరికొన్ని రోజుల్లో జరగబోయే ప్రపంచ క్రీడోత్సవంలో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా ఎన్ఏడీఏ డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇందుకోసం మార్చి 10న బజరంగ్ పునియా నుంచి మూత్ర నమూనాలను కోరింది. కానీ, ఆయన మాత్రం ఆ శాంపిల్ను అందించలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ఇతర ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్ఏడీఏ వెల్లడించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన బజరంగ్.. ఈ నెల జరగనున్న ‘ఎంపిక పరీక్ష’కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా: బజరంగ్ పునియా ప్రకటన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన ప్రముఖ రెజ్లర్లు.. ఆయనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. బజరంగ్ పునియాతో పాటు రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్లు చేసిన పోరాటం ఫలితంగా బ్రిజ్ భూషణ్పై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది.
ఆ కిట్లపై సమాధానం చెప్పాలి..
డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్ ఇవ్వలేదంటూ వచ్చిన నివేదికపై బజరంగ్ పునియా స్పందించారు. ‘ఎన్ఏడీఏ అధికారులకు నమూనాలు ఇచ్చేందుకు ఎన్నడూ నిరాకరించలేదు. గడువు ముగిసిన టెస్టు కిట్లు ఇచ్చారు. వాటిపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో తొలుత సమాధానం చెప్పాలని కోరా. ఆ తర్వాత నన్ను పరీక్షించండి అని విజ్ఞప్తి చేశా. దీనిపై మా న్యాయవాది వారికి త్వరలోనే సమాధానం ఇస్తారు’ అని బజరంగ్ పునియా ఎక్స్ (ట్విటర్)లో వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి