కథానాయికల చుట్టూ బిగుస్తున్న ఈడీ ఉచ్చు!
మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగప్రవేశం చేశారు. కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలపై ...
విచారణకు ముందడుగు వేసిన కేంద్ర బృందం
బెంగళూరు (యశ్వంతపుర): మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసును మరో కోణంలో విచారించడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగప్రవేశం చేశారు. కథానాయికలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలపై ప్రత్యేకంగా కేసు దాఖలు చేసి వివరాల సేకరణ ప్రారంభించారు. ఆ ఇద్దరూ బినామీ పేర్లతో అడ్డగోలు ఆదాయార్జనకు దిగినట్లు అనుమానించి.. ఆ కోణంలో విచారణ మొదలుపెట్టారు. దాఖలాల సేకరణ అనంతరం ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలున్నాయి. కోట్లాది రూపాయల వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగుతుండటంతో స్వయం ప్రేరితంగా కేసు దాఖలు చేసినట్లు కర్ణాటక- గోవా విభాగ ఈడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీసీబీ కస్టడీలో ఉన్న వీరేశ్ఖన్నా, రాహుల్, ప్రశాంత్ రంకా, ప్రతీక్శెట్టినీ విచారిస్తారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు.
రాగిణి రగడ..:
మడివాళ మహిళ సంరక్షణ పునర్వసతి కేంద్రంలో ఉన్న సినీ తారలు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ పరస్పరం గొడవపడుతున్నట్లు సమాచారం. ‘నీవల్లంటే.. నీవల్లే అంతా జరిగింది’ అంటూ పోట్లాడుతున్నారని తెలిసింది. మరోవైపు రాగిణి ఆరోగ్య వివరాల గుర్తింపు కోసం ఆమె మూత్ర పరీక్ష వేళ వైద్యులు శనివారం అగచాట్ల పాలయ్యారు. వైద్య సిబ్బంది అందించిన చిన్నపాటి సీసాలో ఆమె మంచినీరు పట్టి తెచ్చి ఇచ్చాక.. అసలు విషయం తెలిసి వైద్యులు తలలు పట్టుకున్నారు. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఓ రక్షకభటురాలి సాయంతో మరోసారి ఆ పరీక్షలు సవ్యంగా నిర్వహించాక.. ఊపిరి పీల్చుకున్నారు.
♦ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టైన నిందితులు రవిశంకర్, రాహుల్, వైభవ్జైన్, ప్రశాంత్ రంకా, నియాజ్, ప్రతీక్ శెట్టిలకూ కేసీ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తం, మూత్రం, తల వెంట్రుకల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు.
♦ మాదక ద్రవ్యాల కేసులో నగరానికి చెందిన వైభవ్ జైన్ అనే బంగారు వ్యాపారిని సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. సినీ నటి రాగిణి ద్వివేదికి అప్తుడిగా ఈ నిందితుడు గుర్తింపు పొందాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.