Nikhil: ‘స్పై’.. యాక్షన్‌ షురూ

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజ శేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది.

Updated : 22 May 2022 06:47 IST

నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కె.రాజ శేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ లీ విటేకర్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా సెట్లో దిగిన ఓ ఫొటోను నెట్టింట పంచుకున్నారు. ఆ ఫొటోలో నిఖిల్‌, ఐశ్వర్య, ఇతర నటీనటులతో పాటు హాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జూలియన్‌ ఎస్ట్రాడా, బాలీవుడ్‌ ఛాయాగ్రాహకుడు కైకో నకహరా కనిపించారు. ‘‘ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌గా భారీ స్థాయిలో రూపొందిస్తున్నాం. నిఖిల్‌ సరికొత్త లుక్‌తో.. భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది దసరాకు సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. మకరంద్‌ దేశ్‌పాండే, సన్యా ఠాకూర్‌, జిషు సేన్‌ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు. జూలియన్‌ ఎస్ట్రాడా ఛాయాగ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని