Tollywood: వారసుల తోడుగా.. తెరపై మెరవగా
చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే
చిత్రసీమలో మల్టీస్టారర్లకు ఉండే క్రేజ్ చాలా ప్రత్యేకం. ఇద్దరు అగ్ర తారలు కలిసి నటిస్తున్నారని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇక అదే స్టార్లు.. తమ నట వారసులతో కలిసి సందడి చేస్తున్నారని తెలిస్తే ఆ అంచనాలు తారా స్థాయిని దాటేస్తాయి. ఇటు సినీప్రియులకు.. అటు తారల అభిమాన గణానికి అదొక పసందైన విందు భోజనమే. క్లాప్ కొట్టక ముందు నుంచే వాటిపై అందరిలో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. అరుదుగా కుదిరే ఇలాంటి అపురూప కలయికల చిత్రాలు.. త్వరలో అనేకం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పుడిలా వారసులతో కలిసి సందడి చేయనున్న ఆ తారలెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.
సినీ తారలు తమ నట వారసులతో కలిసి సందడి చేయడం తెలుగు తెరకు కొత్తేమీ కాదు. అలనాటి ఎన్టీఆర్, ఏయన్నార్ల తరం నుంచి ఇప్పటి చిరంజీవి, నాగార్జునల తరం వరకు అనేక మంది స్టార్లు తమ వారసులతో కలిసి తెర పంచుకున్న వారే. ఈ తరహాలో ఇటీవల కాలంలో వచ్చిన చిత్రాల్లో ‘మనం’ సినీప్రియులకు ఎంతో ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ఈ సినిమాలో ఏయన్నార్ ఒకేసారి ఇటు తనయుడు నాగార్జునతోను, అటు మనవళ్లు నాగచైతన్య, అఖిల్లతోనూ కలిసి సందడి చేసి మెప్పించారు. అలాగే కథానాయకుడు నాగార్జున ఇటీవల తన తనయుడు నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’లో నటించారు.
చిరు.. చిరుతల సందడి..
‘బంగార్రాజు’ లాంటి మ్యాజిక్నే ‘ఆచార్య’తో చేసి చూపించనున్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన తన తనయుడు రామ్చరణ్తో కలిసి నటించిన తొలి చిత్రమిది. కొరటాల శివ తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా కన్నా ముందు ‘మగధీర’, ‘బ్రూస్లీ’ వంటి చిత్రాల్లో చరణ్తో కలిసి తెరపై కనిపించారు చిరు. అవన్నీ అతిథి పాత్రలే. పూర్తి స్థాయిలో కలిసి నటించింది లేదు. ఎట్టకేలకు ‘ఆచార్య’ ద్వారా ఇన్నాళ్లకు ఈ తండ్రీ కొడుకులిద్దర్ని పూర్తిస్థాయిలో తెరపై చూసుకునే అవకాశం దొరికింది ప్రేక్షకులకు. వాస్తవానికి ఇందులో చరణ్ది కీలక పాత్రే అయినా.. కథ పరంగా ఎంతో ప్రాధాన్యముంది. సినిమాలోని ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో ఈ తండ్రీ తనయులిద్దరూ నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో చిరు టైటిల్ పాత్రలో కనిపించనుండగా.. సిద్ధ పాత్రలో చరణ్ దర్శనమిస్తారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రెబల్ కాంబినేషన్..
కృష్ణంరాజు నట వారసుడిగా వెండితెరకు పరిచయమై.. అనతి కాలంలోనే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయారు. ఆయన ఇప్పటికే ‘బిల్లా’, ‘రెబల్’ వంటి చిత్రాల్లో తన పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ రెబల్ హీరోలిద్దరూ ముచ్చటగా మూడోసారి ‘రాధేశ్యామ్’లో కలిసి కనువిందు చేయనున్నారు. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే ప్రేమ కథాంశంతో రూపొందిన చిత్రమిది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్ కనిపించనుండగా.. పరమహంస అనే ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు సందడి చేయనున్నారు. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. త్వరలో కొత్త విడుదల తేదీపై స్పష్టత రానుంది.
ఓటీటీ వేదికపై.. బాబాయ్ అబ్బాయ్
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటిస్తే చూడాలన్నది సినీప్రియుల కోరిక. ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ఈ బాబాయ్ అబ్బాయ్ల క్రేజీ కాంబినేషన్.. ‘రానా నాయుడు’ రూపంలో కార్యరూపం దాల్చింది. అయితే ఇది వెండితెరపై సందడి చేసే చిత్రం కాదు.. ఓటీటీ వేదికగా అలరించనున్న వెబ్సిరీస్. విభిన్నమైన యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సిరీస్.. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఎంతో ప్రాచుర్యం పొందిన అమెరికన్ షో ‘రే డోనోవన్’ షో ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. కరన్ అన్షుమన్, సుపర్న్ వర్మ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
తండ్రీ కొడుకుల ‘మహాన్’
‘అపరిచితుడు’, ‘శివ పుత్రుడు’, ‘ఐ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైన నటుడు విక్రమ్. ఆయన తన తనయుడు ధ్రువ్ ‘అర్జున్రెడ్డి’ రీమేక్తో వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ తండ్రీ కొడుకులిద్దరూ తొలిసారి ‘మహాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. గ్యాంగ్స్టర్స్ మధ్య సాగే ప్రతీకార కథగా ఉంటుంది. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తనయతో.. రాజ‘శేఖర్’..
కథానాయకుడిగా తెరపై ఎన్నో విభిన్నమైన పాత్రలతో అలరించారు రాజశేఖర్. ఇప్పుడాయన తొలిసారి తెరపై తన తనయ శివానీ రాజశేఖర్తో కలిసి నిజ జీవిత పాత్రలో సందడి చేయనున్నారు. మరి ఈ తండ్రీ కూతుళ్ల అల్లరి వెండితెరపై ఎలా ఉండనుందో తెలియాలంటే ‘శేఖర్’ విడుదల వరకు వేచి చూడాల్సిందే. రాజశేఖర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జీవితా రాజశేఖర్ తెరకెక్కించారు. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్గా రూపొందింది. ఇందులో రాజశేఖర్, శివాని తండ్రితనయలుగా నటించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.