Tapsee: ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది

‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్‌ నాయిక తాప్సీ.

Updated : 02 May 2024 09:50 IST

‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్‌ నాయిక తాప్సీ. పాత్ర ఏదైనా తనదైన శైలి ఆకట్టుకుందీమె. పెళ్లి అనంతరం తొలిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ మహిళా ప్రాధాన్యత చిత్రాల గురించి మాట్లాడింది. ‘ఈ రోజుల్లో సినిమాల పట్ల ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. వీక్షకులు కథానాయకుల కథనాలతో అలరించే సినిమాల్ని మాత్రమే కాకుండా నాయిక నాయకత్వం ఉన్న చిత్రాల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ‘ది డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’, ‘క్వీన్‌’ చిత్రాలు విడుదలైనప్పటి నుంచి సినిమాల పట్ల ప్రేక్షకుల ధోరణి మారిందని నా అభిప్రాయం. మహిళా ప్రాధాన్యమున్న ఈ మూడు చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొని అభిమానుల్ని అలరించాయి. ఇప్పుడిలాంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకి వస్తున్న ఆదరణ సినీరంగంలో కెరీర్‌ని కొనసాగించగలననే భరోసాను ఇచ్చింది. ఇలాంటి చిత్రాల పట్ల సినీ ప్రియుల్లో వస్తున్న మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది’ అంటూ ముగించింది తాప్సీ. ప్రస్తుతం ఈమె నటించిన ‘ఖేల్‌ ఖేల్‌ మే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని