Natyam: నందమూరి బాలకృష్ణ చేతుల మీదగా ‘నాట్యం’ పాట

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నమఃశివాయ’ అంటూ సాగే పాటను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘ ‘నాట్యం’ సినిమా నుంచి ఇలాంటి అద్భుతమైన..

Published : 06 Aug 2021 13:31 IST

హైదరాబాద్‌: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌, నటి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘నమఃశివాయ’ అంటూ సాగే పాటను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘ ‘నాట్యం’ సినిమా నుంచి ఇలాంటి అద్భుతమైన పాటను విడుదల చేయడం నాకెంతో ఆనందంగా ఉంది. జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ఈ పాటకు శ్రవణ్‌ భరధ్వాజ్‌ అద్భుతంగా సంగీతం అందించారు. ఈ పాటను ఆలపించిన లలిత, కాళభైరవతోపాటు తనలోని కొత్త ప్రతిభతో మనందర్నీ మెప్పించిన కమల్‌కామరాజు, కనులవిందుగా నాట్యం చేసిన సంధ్యారాజుకి నా అభినందనలు’ అని బాలయ్య పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని