Love Story: మిర్యాలగూడ సంఘటనకి ‘లవ్‌స్టోరి’కి సంబంధం లేదు: రామ్‌ మోహన్‌

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది...

Published : 18 Sep 2021 01:04 IST

హైదరాబాద్: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్‌ మోహన్‌రావు ‘ఈటీవీ- ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారం అసత్యమని ఖండించారు. మిర్యాలగూడ సంఘటనకి, ఈ చిత్ర కథకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లోని 600కుపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా నిర్ణీత సమయానికంటే ముందే ప్రదర్శన మొదలుపెట్టి 4 ఆటలు ఆడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని