Unni Mukundan: సమాజం ఎటు వెళ్తుందో చూపించాం
‘‘సరోగసీ (అద్దె గర్భం) అనేది చెప్పడానికి సులభంగా ఉంటుంది కానీ అదొక భావోద్వేగ ప్రయాణం. తేలికగా దానిపై వ్యాఖ్యలు చేయకూడదు. శాస్త్రీయంగా చూస్తే.. అదొక అద్భుతం. పురాణాల్లోనూ మనం ఇటువంటి వాటి గురించి విన్నాం.
‘‘సరోగసీ (అద్దె గర్భం) అనేది చెప్పడానికి సులభంగా ఉంటుంది కానీ అదొక భావోద్వేగ ప్రయాణం. తేలికగా దానిపై వ్యాఖ్యలు చేయకూడదు. శాస్త్రీయంగా చూస్తే.. అదొక అద్భుతం. పురాణాల్లోనూ మనం ఇటువంటి వాటి గురించి విన్నాం. చట్ట ప్రకారం అద్దె గర్భాన్ని ఆశ్రయించినప్పుడు ఎవరికీ ఎలాంటి సమస్య ఉండద’’న్నారు నటుడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan). ‘జనతా గ్యారేజ్, ‘భాగమతి’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన.. ఇప్పుడు ‘యశోద’ (Yashoda)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. సమంత (Samantha) టైటిల్ పాత్రలో నటించిన చిత్రమిది. హరి - హరీష్ సంయుక్తంగా తెరకెక్కించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. ఈ సినిమా నవంబరు 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఉన్ని ముకుందన్ విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘‘భవిష్యత్తు ప్రధానంగా సాగే చిత్రమిది. రానున్న రోజుల్లో మన సమాజం ఎటు వెళ్తుందనేది చూపిస్తున్నాం. త్వరలో అది వాస్తవ రూపంలోకి మారుతుందని నమ్మకం. తెలుగులో నేనిప్పటి వరకు మూడు చిత్రాలు చేశా. ప్రతి దాంట్లోనూ మంచి పాత్రలే చేశా. అవన్నీ విజయవంతమయ్యాయి. ఇప్పుడీ ‘యశోద’లోనూ ఓ మంచి పాత్రే చేశా. అదేంటన్నది ప్రస్తుతానికి చెప్పలేను. తెరపై చూస్తేనే బాగుంటుంది. నేనైతే ఒక్క మాట చెప్పగలను. మంచి సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నాం’’.
* ‘‘నటుడిగా కొత్తదనం చూపించడమంటే ఇష్టం. ఏ సినిమా చేయాలన్నా.. కథ ఎలా ఉంది, అందులో నా పాత్ర ఏంటి, ఆ పాత్రలో నేను ఎంత చేయగలను? అని ఆలోచించుకునే రంగంలోకి దిగుతా. నటుడిగా రిహార్సల్స్ ఇవ్వడానికి నేను కొంచెం ఆలోచిస్తా. సెట్లో ఇతర నటులకు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తా. ఏం చేసినా నేరుగా కెమెరా ముందే చేసి చూపిస్తా. అప్పుడు తోటి నటుల నటన సహజంగా ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నా. ‘మాలికాపురం’ అనే చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నాం’’.
* ‘‘ఈ చిత్రం కోసం సమంత చాలా కష్టపడింది. పోరాటాలు, భావోద్వేగ సన్నివేశాలు చేశారు. సామ్తో కలిసి పని చేస్తున్నప్పుడు తను మయోసైటిస్తో బాధ పడుతున్నట్లు తెలియదు. సెట్లో తన పని విషయంలో చాలా పక్కాగా ఉంటారామె. తను ఇలాంటి వ్యాధితో పోరాటం చేస్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. ఇన్స్టాలో ఆమె పోస్ట్ చూసి బాధపడ్డా. త్వరలో ఆమె పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు వస్తారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.