కరోనాపై చైనా జవాబుదారీగా ఉండాల్సిందే..!
మరోసారి స్పష్టం చేసిన అమెరికా
వాషింగ్టన్: యావత్ ప్రపంచం సంక్షోభంలోకి వెళ్లడానికి కారణమైన కొవిడ్-19 మహమ్మారిపై చైనా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. కొవిడ్-19కు మూలమైన చైనా, వైరస్పై పారదర్శకంగా ఉండడంతో పాటు జవాబుదారీగా ఉండాల్సిందేనని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో సంభవించే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు బలమైన వ్యవస్థలను నిర్మించుకోవాలని అభిప్రాయపడ్డారు.
‘మరో మహమ్మారిని సాధ్యమైనంత వరకు నిర్మూలించడమే మనముందున్న అసలైన సవాల్. ఇందుకోసం అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒకవేళ మరో మహమ్మారి వచ్చిన నేపథ్యంలో వాటి వల్ల కలిగే ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలి’ అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ కోరారు. కొవిడ్-19 వంటి మహమ్మారులు విజృంభించిన సమయంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలకు అందుబాటులో ఉంచడంపై పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన దర్యాప్తు నివేదికపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆంటోనీ వ్యాఖ్యలు కీలకప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
డబ్ల్యూహెచ్ఓ నివేదికపై ఆందోళన..
కొవిడ్ మూలాలపై సమాచారాన్ని యావత్ ప్రపంచానికి తెలియజెప్పడంలో చైనా అంతర్జాతీయ నిబంధనలు పాటించడం లేదని అమెరికా విదేశాంగశాఖ ఆరోపించింది. ముఖ్యంగా కొవిడ్ మూలాలపై నివేదిక రూపొందించడానికి డబ్ల్యూహెచ్ఓ అనుసరించిన విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన డబ్ల్యూహెచ్ఓ బృందానికి చైనా సరైన సమాచారం అందించకపోవడమే ఈ ఆందోళనకు కారణమన్నారు. అయితే, దీనిపై నివేదిక ఏవిధంగా వస్తుందో చూద్దాం అని ఆంటోని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. చైనా నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా మిత్రదేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Brain Tumor: తరచుగా తలనొప్పి వస్తుందా..? అనుమానించాల్సిందే..!
-
Movies News
కొన్నిసార్లు నోరు విప్పకపోవడమే బెటర్.. ఎందుకంటే! : విజయ్ దేవరకొండ
-
India News
Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
-
Technology News
Xiaomi Mix Fold 2: షావోమి మడత ఫోన్, హ్యుమనాయిడ్ రోబోట్ చూశారా?
-
Sports News
Washington Sundar: వాషింగ్టన్ సుందర్కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!
-
Movies News
Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Pani Puri: పానీపూరీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. 100 మందికిపైగా అస్వస్థత!
- China Phones: రూ.12 వేలలోపు చైనా ఫోన్ల నిషేధంపై కేంద్రం వైఖరి ఇదేనా!
- Cricket News: జింబాబ్వేతో వన్డే సిరీస్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్
- Kajal Aggarwal: ‘బాహుబలి’ కట్టప్పగా మారిన కాజల్.. ప్రభాస్గా ఎవరంటే?
- Arun Vijay: వారి మధ్య ఐక్యత లేకపోవడం వల్లే కోలీవుడ్ నష్టపోతోంది: అరుణ్ విజయ్
- Karthikeya 2: తప్పే కానీ తప్పలేదు.. ఎందుకంటే ‘కార్తికేయ-2’కి ఆ మాత్రం కావాలి: నిఖిల్
- Prudhvi Raj: ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ చూసి ఉండం.. మాధవ్ వీడియోపై పృథ్వీరాజ్ కామెంట్
- Tamil Rockerz: ‘సినీ పైరసీ భూతం’ హెడ్ అతడే.. ‘తమిళ్ రాకర్స్’ ట్రైలర్ చూశారా!
- Washington Sundar: వాషింగ్టన్ సుందర్కు గాయం.. జింబాబ్వే పర్యటనకు అనుమానమే..!
- Freebies: వాటిపై నిజమైన చర్చ జరగాలి.. కేజ్రీవాల్కు నిర్మలా సీతారామన్ కౌంటర్