Ashok Gehlot: రాజస్థాన్లో బలప్రదర్శనకు అశోక్ గహ్లోత్ ఏర్పాట్లు..!
ఒక వేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు నేటి సాయంత్ర సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో గహ్లోత్ పక్షంలోని కొందరు
ఇంటర్నెట్డెస్క్: ఒక వేళ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు నేటి సాయంత్ర సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో గహ్లోత్ పక్షంలోని కొందరు ఎమ్మెల్యేలు బలప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది సీఎల్పీ సమావేశానికి వచ్చేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా లేరని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శాంతి దారివాల్ పేర్కొన్నారు. దారివాల్ ఇంట్లో జరిగిన ఓ సమావేశానికి గహ్లోత్ పక్షంలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో నామినేషన్ వేసే నాటికి గహ్లోత్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి రాత్రి 7 గంటలకు జైపూర్లో గహ్లోత్ అధికారిక నివాసంలో సమావేశానికి రావాలని పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపు రావడం గమనార్హం. ఇక గహ్లోత్ ప్రత్యర్థి సచిన్ పైలట్ పేరు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది గహ్లోత్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన ముఖ్యమంత్రి పీఠం వీడేందుకు సముఖంగా లేరు. కానీ, పార్టీ అధినాయకత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో నామినేషన్ వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాల్సిందిగా అగ్రనేత రాహుల్గాంధీని ఒప్పించేందుకు చివరిసారిగా మరో ప్రయత్నం చేస్తానని, అది విఫలమైన పక్షంలో తాను నామినేషన్ వేస్తానని బుధవారం గహ్లోత్ ప్రకటించారు. పార్టీ కోసం ఏ బాధ్యతలు స్వీకరించడానికైనా తాను సిద్ధమేనని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.