‘వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను’
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం సమసిసోయింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే తనతో పూర్తిగా విభేదించి పార్టీని వదిలి వెళ్లన తన విరోధి సచిన్పైలట్తో అధిష్ఠానం సయోధ్య
సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై అశోక్ గహ్లోత్
జైపుర్ : రాజస్థాన్లో రాజకీయ సంక్షోభం సమసిసోయింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే తనతో పూర్తిగా విభేదించి పార్టీని వదిలి వెళ్లన తన విరోధి సచిన్పైలట్తో అధిష్ఠానం సయోధ్య కుదుర్చకోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పందించారు.
‘తిరుగుబాటు ఎమ్మెల్యేలను క్షమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించుకుంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. ఏ ఎమ్మెల్యే అయినా నాపై కోపంగా ఉంటే.. వారి సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. నేను గతంలో ఇలానే చేశాను.. ఇప్పుడూ చేస్తాను’ అని గహ్లోత్ అన్నారు.
‘కాంగ్రెస్లో శాంతి, సోదరభావం ఎప్పుడూ అలాగే ఉంటుంది. పార్టీలో సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భాజపా తన వంతు ప్రయత్నం చేసింది. కానీ చివరికి..మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసే ఉన్నారు.. ఒక్కరు కూడా మమ్మల్ని విడిచి పెట్టలేదు’ అని భాజపాపై విమర్శలు గుప్పించారు.
రాజస్థాన్లో నెలరోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. పార్టీ అధిష్ఠానంతో చర్చల అనంతరం సచిన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. తమ వేదనను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం