మేం కట్టిన ఇళ్లకి మీ స్టిక్కరా?: చంద్రబాబు
పేదల ఇళ్ల అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
కళ్లార్పకుండా చంద్రబాబు అబద్ధాలు: జగన్
ఇళ్ల అంశంపై అసెంబ్లీలో వాదోపవాదాలు
అమరావతి: పేదల ఇళ్ల అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గృహనిర్మాణంపై చర్చలో భాగంగా టిడ్కో ఇళ్ల అంశంపై సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇప్పటికే కట్టిన ఇళ్లకు బిల్లులు రావడం లేదని, కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితీ లేదని చంద్రబాబు ఆరోపించారు. అనిశ్చిత పరిస్థితి సృష్టించారని విమర్శించారు. ఈ క్రమంలో టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కీమ్లు ఉంటాయని.. బాబు స్కీమ్, జగన్ స్కీమ్లు ఉండవన్నారు. ఆ మాత్రం ఆలోచన కూడా లేని ముఖ్యమంత్రి ఈయన అంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైకాపా సభ్యులు విమర్శలు చేయగా.. ఆధారాలతో తాను మాట్లాడతానని ఆయన బదులిచ్చారు. దీనికే ఉలిక్కి పడుతున్నారని.. చెప్పాలంటే ఇంకా చాలా ఉందన్నారు. పేర్లు చాలా పెట్టుకుంటున్నారని.. స్టిక్కర్ సీఎంగా మిగిలిపోతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాము కట్టిన ఇళ్లకి మీ స్టిక్కర్ వేసుకోవడమేంటని ప్రశ్నించారు. రూపాయికే ఇళ్లు ఇస్తామనేది తప్పుడు ప్రచారమని ఆరోపించారు.
చంద్రబాబుకు స్పష్టత లేదు: జగన్
అనంతరం సీఎం జగన్ లేచి వైకాపా మేనిఫెస్టో చూపిస్తూ ఇంతపెద్ద ఆధారం కళ్ల ముందు కనిపిస్తున్నా ఏమాత్రం కళ్లార్పకుండా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. తమ మేనిఫెస్టోలో చెప్పినదాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడతారని ఎద్దేవా చేశారు. 300 అడుగుల ఇళ్లు అని మేనిఫెస్టోలో మేం స్పష్టంగా పేర్కొన్నా చంద్రబాబుకు అది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఒక్కో ఇంటికి రూ.6లక్షల రుణం ఇస్తే అందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1.50లక్షలు భరిస్తాయని.. మిగతా రూ.3లక్షల రుణాన్ని తమ ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేస్తుందంటూ పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్ వివరించారు. దానికి సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాట్లాడిన ప్రసంగాన్ని సభలో ప్రదర్శించారు. ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు మాట్లాడారు. నేనొస్తాను.. ఇళ్లన్నీ ఉచితంగా ఇస్తానని జగన్ చెప్పారన్నారు. మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట ఓట్లేశారని.. మాట నిలబెట్టుకోవాలని సూచించారు. సీఎం 300 అడుగులు అని చెప్పారా? పేదల పట్ల వివక్ష వద్దు. సభలో ఒకలా.. మేనిఫెస్టోల్లో ఒకలా అంటే ఎలా? మడమ తిప్పకపోతే..మాట తప్పకపోతే పాలకొల్లు సభలో చెప్పినదానికి నిలబడతారా? అని చంద్రబాబు నిలదీశారు. దీనిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబుకు స్పష్టత లేదన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం