బెంగాల్ ‘షేక్’లా మారిన అభిషేక్: అనురాగ్
పశ్చిమబెంగాల్ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని భాజపా నేత, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బెంగాల్ అభివృద్ధి కాకపోవడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిజిత్లే కారణమని ఆరోపిస్తూ..
కోల్కతా: పశ్చిమ్ బెంగాల్ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రధాని నరేంద్రమోదీతోనే సాధ్యమని భాజపా నేత, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. బెంగాల్ అభివృద్ధి కాకపోవడానికి ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్లే కారణమని ఆరోపిస్తూ.. వారిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం బెంగాల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
‘సాధారణంగా మనకు గల్ఫ్ దేశాల్లో షేక్లు కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ అభిషేక్ అనే వ్యక్తే.. ‘షేక్’ లా మారిపోయారు. ఇక్కడి అభిషేక్ ఇప్పుడు ఎంత పెద్ద షేక్ అయ్యాడో ప్రపంచానికి తెలుసు’ అని ఠాకూర్ తీవ్రంగా విమర్శించారు. ‘పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అది కేవలం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోనే సాధ్యమవుతుంది. బెంగాల్ను అభివృద్ధి చేయడమనేది కష్టతరమైన పని అని కొందరు చెబుతున్నారు. అవును అభివృద్ధి చేయడం ఇష్టం లేని వారికి అది కష్టమైన పనే. కానీ మోదీ తల్చుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు’ అని ఠాకూర్ అన్నారు.
పశ్చిమ్బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. సీఎం మమతా బెనర్జీపై విమర్శలతో భాజపా దూకుడు పెంచుతోంది. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పగ్గాలు అప్పగించి కుటుంబ రాజకీయాలకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని భాజపా ఘాటు విమర్శలు సంధిస్తోంది. కాగా ఇప్పటికే గతనెలలో టీఎంసీ ఆ రాష్ట్రంలో ఎన్నడూ లేని పరాభవాన్ని మూటగట్టుకుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ సహా 60 మంది టీఎంసీ నాయకులు భాజపాలో చేరడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. పార్టీ మారిన వారిలో కీలకమైన సువేందు అధికారి ఉండటం గమనార్హం. మమత తన మేనల్లుడికి అధికార పగ్గాలు అప్పగించే ప్రక్రియ చేపట్టడమే.. ఆయా నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడానికి కారణాలుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్