Amanchi Krishna: త్వరలో కాంగ్రెస్లో చేరతా: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి
చీరాల నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశమయ్యారు.
వేటపాలెం: చీరాల నియోజకవర్గ అభిమానులతో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సమావేశమయ్యారు. త్వరలో షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. తెదేపా అధినేత చంద్రబాబు అంటే తనకెంతో గౌరవమని, తన భావజాలానికి తెదేపాతో కలిసి ప్రయాణించలేకపోయానని పేర్కొన్నారు. వైకాపా అధిష్ఠానం తనకు సముచిత స్థానం ఇచ్చి పర్చూరు నుంచి పోటీ చేయమందని తెలిపారు. కొద్ది రోజులుగా చీరాలలో సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరణ చేస్తే.. కాంగ్రెస్లో చేరాలని అభిమానులు సూచించారని చెప్పారు. ఆటో గుర్తుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని అందువల్లే కాంగ్రెస్లో చేరుతున్నట్టు పేర్కొన్నారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!