Andhra News: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌పై హత్యాయత్నం జరిగింది. 

Updated : 30 Jan 2023 08:57 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌పై హత్యాయత్నం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది యువకులు ఆయనపై హత్యాయత్నం చేశారు. దీంతో కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తాను వెళ్తున్న మార్గంలో కాపు కాసి కత్తులు, కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపారు. తాడిపత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నామనే నెపంతో వైకాపాకు చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారని కార్తీక్ ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని