Bandi Sanjay: ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం?: బండి సంజయ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కరీంనగర్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్ ఆయన.. కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘‘పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్ చేస్తారా? ముందురోజు తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్ చేశారు? చిల్లర బుద్ధులు.. చిల్లర వ్యవహారాలు మీవే.. మావి కాదు. సీఎం కుమారుడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలి. ఎంపీగా ఉన్న నాపట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉంది. పోస్టులు, పైసల కోసమే పోలీసులు పనిచేస్తున్నారు.
నేను సిద్ధం.. సీపీ ప్రమాణం చేయగలరా?
ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం?పేపర్ లీక్తో సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా. నేను కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్న సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?సీపీ చెప్పింది నిజమైతే తన మూడు సింహాల టోపీపై ప్రమాణం చేసి చెప్పాలి. నన్ను గంటల తరబడి వాహనాల్లో ఎందుకు తిప్పారు? లీకైన పేపర్ను జర్నలిస్టు షేర్ చేస్తే తప్పేంటి? ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్లి పేపర్ ఎలా లీక్ చేస్తారు? నేను ౨వేల మందితో సెల్ఫీలు దిగుతా.. అందరితో నాకు లింకులున్నట్లేనా? నష్టపోయిన టీఎస్పీఎస్సీ అభ్యర్థులతో వరంగల్లో భారీ ర్యాలీ నిర్వహిస్తాం.
సింగరేణిలో రాష్ట్రం వాటాయే ఎక్కువ.. ప్రైవేటీకరణ ఎలా?
ఎంపీ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదు. నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే మేం పిచ్చోళ్లమా? తెలంగాణ ఏం అభివృద్ధి చేశారో కేసీఆర్ చర్చకు రావాలి. సీపీ బాగా మాట్లాడారు.. ఆయనకు లీక్, కాపీయింగ్కు తేడా తెలియదు. కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తారా? అనేది భారాస నేతలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాకు జైళ్లు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. యుద్ధానికి మేం సిద్ధం. సింగరేణిలో సమ్మె చేస్తామన్న భారాస నేతలకు దమ్ముందా? సింగరేణిలో ౫౧ శాతం వాటా రాష్ట్రానిది.. ౪౯ శాతం కేంద్రానికిది. అలాంటప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుంది? రాష్ట్రానికి మోదీ వస్తున్నారని తెలిసి రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు అన్ని విషయాలూ తెలుసు’’ అని సంజయ్ అన్నారు.
ఈ కేసు విషయంలో తనకు అండగా నిలిచిన భాజపా జాతీయ నాయకత్వానికి, లీగల్ సెల్ ప్రతినిధులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లో ప్రధాని మోదీ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!