TMC: మమతను వేధించడానికే గవర్నర్ను నియమించారు..!
తన రాష్ట్ర గవర్నర్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసినట్లు చెప్పి పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యపర్చారు.
కోల్కతా: తన రాష్ట్ర గవర్నర్ ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసినట్లు చెప్పి పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యపర్చారు. ఇప్పుడు మమత పార్టీ (టీఎంసీ) పత్రిక జాగో బంగ్లా కూడా ఇదే తరహాలో స్పందించింది. తమ అధినేత్రిని వేధించడానికే భాజపా గవర్నర్ను నియమించిందని నిందించింది. ‘గవర్నర్ను నియమించే సమయంలో భాజపాకు ఉన్న ఏకైక లక్ష్యం.. ఎలాగైనా మమతా బెనర్జీని వేధించడమే. ఈ వేధింపులు, కేంద్రం నుంచి భాజపా నేతల ప్రవాహం ఉన్నా సరే.. మమత మూడోసారి విజయం సాధించారు’ అంటూ భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. గవర్నర్ ఖాతాను మమత బ్లాక్ చేయడంపై కమలం పార్టీ స్పందించింది. ‘ఆమె గవర్నర్ ఖాతాను బ్లాక్ చేస్తే ఏం జరుగుతుంది? ఆయన వెళ్లిపోతారా? ఆయన తన పని తాను చేసుకుంటారు. కానీ భవిష్యత్తు తరాలకు ఇది ఒక చెడు సూచికగా మిగులుతుంది’ అని విమర్శించింది. టీఎంసీ అధినేత్రి నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఖాతా బ్లాక్ చేసిన విషయాన్ని వెల్లడించారు. అందుకు క్షమాపణలు చెప్పారు. ఆయన పెట్టే ట్వీట్లతో చిరాకు వస్తోందని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన విషయమై ప్రధానికి పలుమార్లు లేఖ రాసినట్లు కూడా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్