Eatala: సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని అసెంబ్లీ నుంచి బయటకు పంపారు: ఈటల
తెలంగాణ ఉద్యమంలో సీఎంతో పాటు అడుగులో అడుగు వేసిన ఉద్యమ బిడ్డ అయిన తనను కుట్రతో, దుర్మార్గపు ఆలోచనతో పార్టీ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సీఎంతో పాటు అడుగులో అడుగు వేసిన ఉద్యమ బిడ్డ అయిన తనను కుట్రతో, దుర్మార్గపు ఆలోచనతో పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్లో తాను ఓడిపోవాలని, ప్రశ్నించే గొంతు ఆగిపోవాలని అక్రమంగా సంపాదించిన రూ.వందల కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు. శాసనసభ నుంచి తమను సస్పెండ్ చేసిన అంశంలో హైకోర్టు సూచనను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తిరస్కరించడాన్ని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. ఇందిరాపార్కులోని ధర్నా చౌక్ వద్ద ఈటల రాజేందర్, రఘునందన్రావు, రాజాసింగ్తో పాటు ఆ పార్టీ నేతలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు.
ప్రజాస్వామ్య విలువలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు
‘‘ఈటల రాజేందర్ ఓడిపోయేలా చేయడానికి ఏం కావాలంటే అవి తీసుకోండని.. అసెంబ్లీలో ఈటల కనిపించకూడదని కేసీఆర్ హుకుం జారీ చేశారు. కానీ కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతోందని హుజురాబాద్ ప్రజలు భాజపాను గెలిపించారు. ప్రజాస్వామ్య విలువలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. తెలుగు మాట్లాడే ప్రజానీకం గర్వపడేలా హుజురాబాద్ ప్రజలు తీర్పు ఇచ్చారు.
కేసీఆర్ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి
ప్రజానీకం ఇచ్చిన తీర్పును కేసీఆర్ గౌరవిస్తారని భావించాను. హుజురాబాద్ ఓటమికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తే.. అసెంబ్లీ సమావేశాల్లో నేను పాల్గొనకుండా దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగంతోనే సాకారమైంది. రాజ్యంగంలోని ఆర్టికల్- 3 లేకుంటే ఎవరు దిగొచ్చినా తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదనే విషయాన్ని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలి. నియంతృత్వ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు.
30 రోజులు జరగాల్సిన సమావేశాలు ఏడు రోజులే
గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను ఏడు రోజులే నిర్వహించారు. మా హక్కులను కేసీఆర్ హరించారు. సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని సభాపతి సస్పెండ్ చేశారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కోర్టు ఇచ్చిన తీర్పునూ స్పీకర్ గౌరవించలేదు. భాజపాకు ఇక మిగిలింది ప్రజాక్షేత్రం మాత్రమేనని నిర్ణయించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టాం’’ అని ఈటల అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.