Munugode bypoll: కోటాను మించిన నటుడు సీఎం కేసీఆర్‌: లక్ష్మణ్‌

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబానికి మధ్యేనని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

Published : 16 Oct 2022 15:49 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబానికి మధ్యేనని భాజపా ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. ఎర్రవెల్లిలో 100 ఇళ్లు నిర్మించి ఎనిమిదేళ్లుగా అవే చూపిస్తున్నారని తెరాసపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక కోసమే ఎస్టీల రిజర్వేషన్‌ పెంచారని విమర్శించారు. కేసీఆర్‌కు ఇంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణమాఫీ పేరుతో ఓట్లు దండుకున్నారని.. ఎప్పుడు చేస్తారో చెప్పాలని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ కోటా శ్రీనివాసరావును మించిన నటుడు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని