TS Budget: బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ఎలా అమలు చేస్తారు: హరీశ్‌రావు

రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

Updated : 10 Feb 2024 16:24 IST

హైదరాబాద్‌: రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మొండిచేయి చూపించిందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు. రైతులకు తగిన నిధులు కేటాయించకుండా పంటల బీమా, మద్దతు ధర, రైతు భరోసా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో .. అసెంబ్లీలోనూ అబద్ధాలే చెబుతోందని మండిపడ్డారు.

‘‘రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.82వేల కోట్లు కావాలి. బడ్జెట్‌లో రూ.16వేల కోట్లు మాత్రమే కేటాయించారు. పంటల బోనస్‌కు రూ. 15వేల కోట్లు, రుణమాఫీకి రూ.40వేల కోట్లు అవసరం.. కానీ, వాటికి రూపాయి కూడా కేటాయించలేదు. ఇళ్ల నిర్మాణానికి రూ.23వేల కోట్లు అవసరమవుతాయి. ఇందిరమ్మ ఇళ్లకు రూ.7,700 కోట్లు పెట్టారు. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. మొదటి అసెంబ్లీ సమావేశంలో ఆరు గ్యారంటీలపై చట్టం చేస్తామన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. అయినా చట్టం చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది’’అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని