Hyderabad News: రాజాసింగ్ బుల్డోజర్ వ్యాఖ్యలు.. కేసు నమోదు
గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలతో మంగళ్హాల్ పీఎస్లో
హైదరాబాద్: గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశాలతో మంగళ్హాట్ పీఎస్లో కేసు నమోదు చేశారు. యూపీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఓటర్లను ఉద్దేశించి రాజాసింగ్ ఇటీవల వీడియో విడుదల చేశారు. యూపీ ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తామని హెచ్చరించారు. భాజపాకు ఓటువేయని వారి ఇళ్లకు బుల్డోజర్లను పంపిస్తామన్నారు. దీనిపై రాజాసింగ్కు నోటీసులు జారీ చేసిన ఈసీ.. 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన వద్ద నుంచి సమాధానం రాకపోవడంతో కేసు నమోదు చేయాల్సిందిగా ఈసీ మంగళ్హాట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం