Chandrababu: దిల్లీ పెద్దలను కలవనున్న చంద్రబాబు.. రాజకీయవర్గాల్లో ఆసక్తి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన ఖరారైనట్టు సమాచారం.

Updated : 06 Feb 2024 20:20 IST

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ పర్యటన ఖరారైనట్టు సమాచారం. బుధవారం రాత్రి అమరావతి నుంచి దిల్లీ వెళ్లనున్న ఆయన కేంద్ర పెద్దలతో విడివిడిగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు దిల్లీ టూర్‌ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తెదేపా, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పోటీ చేసే అభ్యర్థుల జాబితా మాత్రం ఇంకా వెల్లడించలేదు. దిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరిని కలుస్తారు? భాజపాతో పొత్తుపై స్పష్టత వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని