Manipur Violence: చర్చకు నువ్వే దూరం.. కాదు నువ్వే.. కాంగ్రెస్, భాజపా పరస్పర విమర్శలు
మణిపుర్ అల్లర్లపై చర్చకు నువ్వే దూరంగా ఉన్నావంటే.. నువ్వే దూరంగా ఉన్నావ్ అంటూ కాంగ్రెస్, భాజపాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
దిల్లీ: మణిపుర్ అల్లర్లు పార్లమెంట్ లోపల, బయట అగ్గి రాజేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో మహిళలపై చోటు చేసుకున్న అఘాయిత్యాలపై ప్రధాని మోదీ మాట్లాడకుండా భాజపా రక్షణ కవచంలా పని చేస్తోందంటూ కాంగ్రెస్ విమర్శించగా.. తన బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ చర్చకు దూరంగా ఉంటోందని భాజాపా తిప్పికొట్టింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే కారణంతోనే హస్తం పార్టీ చర్చకు దూరంగా ఉంటోందని భాజపా విమర్శించింది.
దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత గౌరవ్ గొగోయ్ అధికార భాజపాపై మండి పడ్డారు. ‘‘ ప్రధాని మోదీ అమెరికన్ కాంగ్రెస్లో ప్రసంగిస్తారు. కానీ భారత పార్లమెంట్లో మాత్రం మాట్లాడరు. ఫ్రాన్స్ ప్రధాని మేక్రాన్ను ఆలింగనం చేసుకుంటారు. కానీ, మణిపుర్ అల్లర్ల బాధితులను మాత్రం చేరదీయరు.’’ అని విమర్శించారు. ప్రధాని మోదీని పార్లమెంట్లో మాట్లాడనీయకుండా భాజపా ఎంపీలు ఓ రక్షణ కవచంలా పని చేస్తున్నారని, మణిపుర్ అల్లర్లను ఓ సాధారణ శాంతిభద్రతల సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చేసే ప్రధాని మోదీ.. ఇంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను మాత్రం వెనకేసుకు వస్తున్నారని, అందులో మతలబేంటని గొగోయ్ ప్రశ్నించారు.
అందుకే సంజయ్ని సస్పెండ్ చేశారు: ఆప్
మణిపుర్లో జరుగుతున్న అల్లర్ల గురించి పార్లమెంట్లో విస్త్రృత చర్చ జరగాలని గొగోయ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల కంటపడకుండా ప్రధాని మోదీ పారిపోతున్నారని విమర్శించారు. మణిపుర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నిండు పార్లమెంట్లో అబద్ధాలు చెబుతున్నారని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసిన్హ గోహిల్ ఆరోపించారు. ఇంకెన్ని రోజులు ఈ దేశాన్ని తప్పుదోవపట్టిస్తారని ఆయన ప్రశ్నించారు.
మహిళలపై నేరాలతో కాంగ్రెస్ రాజకీయం: స్మృతి ఇరానీ
కాంగ్రెస్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. మహిళలపై జరుగుతున్న నేరాలతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మణిపుర్ ఘటనలపై చర్చించేందుకు కాంగ్రెస్ తప్పించుకు తిరుగుతోందన్నారు. ఒకవేళ మణిపుర్ పరిస్థితులపై చర్చిస్తే... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అల్లర్ల గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందని కాంగ్రెస్కు తెలుసని, అందుకే చర్చకు ఆమడ దూరంలో ఉంటోందని ఆమె అన్నారు. మహిళలను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.
మణిపుర్ అల్లర్లపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి ఆరా తీసింది. కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్, తృణమూల్ అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్ గురించి విపక్షాలు ఎందుకు గొంతువిప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. మణిపుర్లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ చర్య గురించి తెలిసిన వెంటనే నేరస్తులపై భాజపాసర్కార్ కఠినచర్యలు తీసుకుందన్నారు. నేరస్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ ఇదివరకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!