కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త నినాదం.. #CryPMPayCM హ్యాష్ట్యాగ్తో పోస్టులు
Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. ప్రధాని మోదీ, బసవరాజ్ బొమ్మైను ఉద్దేశించి #CryPMPayCM పేరిట హ్యాష్ట్యాగ్తో కొత్త నినాదాన్ని ట్రెండ్ చేస్తోంది.
బెంగళూరు: కన్నడ నాట ఎన్నికలు (Karnataka Elections 2023) సమీపిస్తున్నకొద్దీ రాజకీయ విమర్శల వేడి పెరుగుతోంది. రెండు జాతీయ పార్టీలైన భాజపా- కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా సాగుతున్న ఈ పోరులో.. ఇప్పటికే జాతీయ నాయకులు రంగంలోకి దిగి ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. మోదీనుద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేయడం.. కాంగ్రెస్ తనను 91 సార్లు దూషించిందంటూ ప్రధాని విమర్శలు చేయడంతో ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక తాజాగా తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. #CryPMPayCM అంటూ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
కర్ణాటక ఎన్నికల సభలో ఇటీవల పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధానిని విష సర్పంతో పోల్చారు. తర్వాత అలా అనలేదంటూ మాట మార్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి తనను విమర్శించడమే పని అని, ఇప్పటి వరకు ఆ పార్టీ 91 సార్లు తనను దూషించందంటూ ప్రధాని అన్నారు. ఈ విమర్శలపై తాజాగా ప్రియాంక వాద్రా మాట్లాడారు. ప్రజల గోడు పట్టించుకోకుండా తన బాధలను చెప్పుకోవడానికి మోదీ వచ్చారంటూ ఎద్దేవాచేశారు. తమ కుటుంబాన్ని భాజపా నేతలు దూషించినవన్నీ ఒకచోట చేరిస్తే ఒక పుస్తకాన్నే ముద్రించొచ్చని వ్యాఖ్యానించారు.
Also Read: భాజపా మేనిఫెస్టో: ఉచితంగా సిలిండర్లు.. నందిని పాలు!
ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రియాంక చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కొత్త నినాదాన్ని అందుకున్నారు. గతంలో బసవరాజ్ బొమ్మైని ఉద్దేశించి పేసీఎం పేరిట పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఏదైనా 40 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తోందన్న ఆరోపణలు రావడంతో గతేడాది సెప్టెంబర్లో ఈ పోస్టర్లు కర్ణాటకలో కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పేసీఎం, క్రై పీఎం ( #CryPMPayCM) అంటూ ఓ హ్యాష్ట్యాగ్ను కాంగ్రెస్ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి. మరోవైపు సోమవారం భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపైనా కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చకుండా మరో బోగస్ హామీ పత్రాన్ని విడుదల చేసిందంటూ ఆరోపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు