ఆ గట్టునుంటావా దిల్లీ ఓటరా.. ఈ గట్టుకొస్తావా
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తమ వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి
కేజ్రీవాల్, మనోజ్ తివారీ ట్విటర్ వార్
దిల్లీ: దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచార వేగం పెంచాయి. గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తమ వాగ్ధాటితో ప్రత్యర్థి పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భాజపా ఎంపీ మనోజ్ తివారీ ట్విటర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. ‘‘ఆ వైపునుంటారా లేదా అభివృద్ధి జరిపించే మావైపున ఉంటారా’’ అని పరస్పరం విమర్శించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ మంగళవారం ఉదయం అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ‘ఓ వైపు - భాజపా, జేడీయూ, ఎల్జేపీ, జేజేపీ, కాంగ్రెస్, ఆర్జేడీ.. మరోవైపు - స్కూల్, హాస్పిటల్, నీరు, విద్యుత్, మహిళలకు ఉచిత రవాణా, దిల్లీ ప్రజలు.. నా లక్ష్యం - అవినీతిని ఓడించడం, దిల్లీని ముందుకు తీసుకెళ్లడం.. వారందరి ఏకైక లక్ష్యం - నన్ను ఓడించడం’ అని సీఎం విమర్శలు చేశారు.
కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కేవలం 30 నిమిషాల్లోపే భాజపా దిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ సీఎంకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ‘ఓ వైపు - దెబ్బతిన్న రోడ్లు, కలుషితమైన, విషపూరితమైన నీరు, ఒక్క కొత్త స్కూల్, కొత్త ఆసుపత్రి లేదు. హాస్పిటళ్లలో ఆపరేషన్ థియేటర్లు మూతబడ్డాయి. ఒక్క విద్యుత్ బస్సు కూడా లేదు. అవినీతిపై పోరాడుతున్న నేతలను పార్టీ నుంచి తొలగించింది. మహాకూటమితో కాంగ్రెస్తో చేతులు కలిపింది. మొత్తానికి 70 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైంది.
మరోవైపు - భాజపా అందరితో కలిసి అందరి అభివృద్ధి కోసం పనిచేస్తోంది’ అని తివారీ ఆప్ సర్కార్ను దుయ్యబట్టారు. దిల్లీ ప్రజలు భాజపాతోనే ఉంటారని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా పరస్పర విమర్శలతో ‘ఆ పార్టీకి ఓటేస్తారో.. లేదా మా పార్టీకి ఓటేస్తారో మీరే తేల్చుకోండి’ అంటూ పరోక్షంగా దిల్లీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్