మోదీకి రాజ్యాంగ ప్రతి పంపిన కాంగ్రెస్
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రధాని మోదీకి రాజ్యాంగ ప్రతిని పంపింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా....
దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రధాని మోదీకి రాజ్యాంగ ప్రతిని పంపింది. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పుస్తకాన్ని పంపి.. దేశాన్ని విభజించే ముందు ఓ సారి చదువుకోండి అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ వరుస ట్వీట్లు చేసింది. అందులో ఆ పార్టీ నేతలు సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజ్యాంగ ప్రవేశిక చదువుతున్న వీడియోలను ఉంచింది. వాటితో పాటు అమెజాన్లో కొనుగోలు చేసిన రాజ్యాంగ ప్రతికి సంబంధించి స్క్రీన్షాట్ను కూడా జోడించింది.
‘ప్రధాని మోదీజి ఈ ప్రతి త్వరలోనే మీకు చేరుతుంది. మీరు దేశాన్ని విభజించాలని యోచించే ముందు దీన్ని ఓ సారి చదవండి. ఇట్లు కాంగ్రెస్ పార్టీ’’ అని ట్వీట్ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానేమనన్న భావనను భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోలేకపోతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఆ పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. వ్యక్తులపై వివక్ష చూపుతూ రూపొందించే చట్టాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం