Andhra News: మా అమ్మకి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది.. ఆమెను ఎక్కడ దాచిపెట్టారు?: యోగేంద్రనాథ్
గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైకాపా ఎంపీటీసీ తాడిబోయిన పద్మావతి కనిపించకపోవడంపై
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలానికి చెందిన వైకాపా ఎంపీటీసీ తాడిబోయిన పద్మావతి కనిపించకపోవడంపై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) బలవంతంగా తీసుకెళ్లారని.. ఎంపీపీ ఎన్నిక జరుగుతున్నా తమ తల్లిని ఎందుకు తీసుకురాలేదని ఆమె కుమారుడు యోగేంద్రనాథ్ ప్రశ్నించారు. తమ తల్లి ఎక్కడున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ తల్లిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారంటూ ఎస్ఈసీ, డీజీపీకి పిర్యాదు చేసినా కనీస స్పందన కూడా లేదని యోగేంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపీపీ ఎన్నిక ఎదుర్కొంటామంటున్న ఎమ్మెల్యే ఆర్కే.. ఎందుకు దాచిపెట్టారని ఆయన నిలదీశారు. తమ తల్లి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతోందని.. ఆమె ఆరోగ్యం పట్ల తమకు ఆందోళనగా ఉందన్నారు. ఈ కిడ్నాప్పై హైకోర్టును ఆశ్రయిస్తామని.. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని యోగేంద్రనాథ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం