ప్రత్యేక హోదా సాధనలో వైకాపా విఫలం
ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు.
ఆ పార్టీ ఎంపీలు చేతగాని వారిలా ఉండొద్దు: సీపీఐ రామకృష్ణ
బస్సు యాత్ర ప్రారంభం
అనంతపురం ఆజాద్నగర్, కర్నూలు బి.క్యాంపు, డోన్ పట్టణం, న్యూస్టుడే: ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటు సాక్షిగా నమ్మబలికి ఓట్లు దండుకున్న భాజపా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు చేపట్టిన బస్సు యాత్రను అనంతపురంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం నేతలు ప్రారంభించారు. అది డోన్ మీదుగా కర్నూలుకు చేరుకుంది. గురువారం ఉదయం నంద్యాలకు చేరుకుని, ఆపై వైయస్ఆర్ జిల్లా మైదుకూరు, కడప, అన్నమయ్య జిల్లా రాజంపేట మీదుగా రాత్రికి తిరుపతికి చేరుకోనుంది. అనంతపురంలో పీవీకేకే కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా ఎంపీలు చేతకానివారిలా ఉండొద్దని హితవు పలికారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాట తప్పడం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయిందన్నారు. డోన్, కర్నూలులో పలువురు నేతలు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పార్టీ నేతలతో పాటు అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణ రాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్సన్బాబు, శివారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లెనిన్బాబు, రాజేంద్ర, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!