ప్రతి ‘అసెంబ్లీ’ స్థానంలో 10వేల నకిలీ ఓట్లు చేర్చేందుకు వైకాపా కుట్ర
‘రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ల పేర్లను చేర్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్గా ఉంది.
సీఎం జగన్ పాలనపై విరుచుకుపడ్డ భాజపా నేత బండి సంజయ్
ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ల పేర్లను చేర్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై చాలా సీరియస్గా ఉంది. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్ చేసింది’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ఓటర్ చేతన్ మహాభియాన్లో భాగంగా సోమవారం బండి సంజయ్ విజయవాడలోని పార్టీ శ్రేణులను ఉద్దేశించి హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో మాట్లాడారు. గంజాయి విక్రయాలు, ఇసుక దందా, భూ కబ్జాలు ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాయి. కొండలను కూడా మాయం చేస్తున్నారు మందుబాబులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్ జగన్దే. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు గుప్పించి.. మద్యం బాండ్లు రిలీజ్ చేయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సారి వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న భావన ప్రజల్లో నెలకొంది’ అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రంలో ఒక వర్గానికే కొమ్ముకాస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘రాష్ట్రంలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరు? ఆయన కుమార్తె వివాహం క్రైస్తవ ఆచార విధానంలో జరిగిన మాట వాస్తవం కాదా? నేను నాస్తికుడినని ఆయన గతంలో చెప్పలేదా? తిరుమలకు వచ్చే భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? ప్రజాభిమానం కలిగిన జనసేన అధినేత పవన్కల్యాణ్ యాత్రను అడ్డుకోవడమేమిటి? కేంద్రం నిధులతోనే అంతో..ఇంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోంది. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా తీరుస్తుందో ఆలోచించండి. అదే భాజపాకు అధికారమిస్తేనే కేంద్ర సహకారంతో అప్పులు తీర్చడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చని గమనించాలి. రానున్న ఎన్నికల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నాయకత్వంలో భాజపా సత్తా చాటడం ఖాయం’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఓటర్ల తొలగింపు: పురందేశ్వరి
రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీ సందర్భంగా టాంపరింగ్ మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ‘తెదేపా హయాంలోనూ ఓట్ల గల్లంతు జరిగింది. విశాఖలోని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నియోజకవర్గంలో 2.60 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో 70 వేల అనర్హుల ఓట్లు ఉన్నాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్లు తొలగించారన్న కారణంతో భాస్కరరెడ్డి, స్వరూపరాణి లను సస్పెండ్ చేశారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ఎలా రూపొందిస్తున్నారన్నది అర్థమవుతోంది. ఒకే ఇంటి నంబర్తో వందల ఓట్లు ఉన్నాయి. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని హైదరాబాద్ కేంద్రంగా ఓట్ల తొలగింపు జరుగుతోంది. దొంగ ఓట్లపై ఫిర్యాదులు చేయడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తాం’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!