ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం?
ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలతో.. తెలంగాణకు సంబంధమేంటని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
అది రెండు పార్టీల రాజకీయ ఘర్షణ
చంద్రబాబు అరెస్టయింది ఏపీలో.. ధర్నాలు చేయాల్సిందీ ఆ రాష్ట్రంలోనే
లోకేశ్, జగన్, పవన్ ముగ్గురూ నాకు స్నేహితులే: కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలతో.. తెలంగాణకు సంబంధమేంటని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఏపీ రాజకీయాలు, చంద్రబాబు అరెస్టుపై కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల ఘర్షణ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అరెస్టయింది ఆంధ్రప్రదేశ్లో. ధర్నాలు చేయాల్సింది ఆ రాష్ట్రంలోనే. నిర్మొహమాటంగా చేయండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఒకరు ర్యాలీలు తీస్తారు. ఇంకోరోజు ఇంకొకరు తీస్తారు. మరి మేం ఏం చేయాలి? పక్కింటి పంచాయితీని ఇక్కడ తేల్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో ఒకరితోఒకరు తలపడండి. రాజమహేంద్రవరంలో భూమి దద్దరిల్లిపోయేలా ర్యాలీలు తీయండి. మాకేం సంబంధం? వాళ్ల వాళ్ల పంచాయితీలు తెచ్చి హైదరాబాద్లో పెడతామంటే ఎలా? మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఎలా అనుమతిస్తాం? ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. సున్నితమైన అంశం అనుకున్నప్పుడు.. సున్నితంగానే వ్యవహరించాలి. రోజూ రన్నింగ్ కామెంటరీ లాగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయస్థానంలో విషయం ఉన్నప్పుడు.. ఎవరు పడితే వారు రోడ్డు మీదికొచ్చి కామెంట్లు చేయొచ్చా? నాకు లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్ స్నేహితులే. ఏపీతో మాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిందేమీ లేదు. వాళ్లకు కూడా ఇక్కడేమీ ఇష్యూస్ లేవు. అలాంటప్పుడు మాకూ మాకూ మధ్య లేనిపోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారు?
అంతా కలిసిమెలిసి ఉంటున్నారు
హైదరాబాద్లో ఆంధ్రా, రాయలసీమ, కేరళ, పంజాబ్.. ఇలా అన్ని ప్రాంతాలకు చెందినవారు కలిసిమెలసి ఉంటున్నారు. ఆంధ్రా ప్రజలు ఇక్కడ గత పదేళ్లుగా సుఖంగా, సుభిక్షంగా ఉన్నారు. వాళ్లనెందుకు ఇబ్బంది పెట్టడం? వాళ్ల మధ్య వైషమ్యాలు, రాజకీయ కక్షలు లేపి, వాటిని మాకు లేదా ఇంకొకళ్లకు చుట్టి.. దాన్నుంచి ఇంకేదో సాధిద్దామనుకుంటే.. అదెలా కరెక్టు అవుతుంది? లోకేశ్ ఒక స్నేహితుడి ద్వారా మాట్లాడించారు.. ‘ధర్నాలకు అనుమతి ఇవ్వాలి’ అని కోరారు. దానికి నేను ఒక్కటే సమాధానమిచ్చా.. ‘బ్రదర్.. ఇవాళ మీరు చేస్తారు.. రేపు మీకు పోటీగా మరొకరు చేస్తారు. అప్పుడు హైదరాబాద్లో శాంతిభద్రతలు ఏం కావాలి? ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆందోళనలు చేయలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో.. అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు’ అని వివరించా. ఇవాళ ఎంతో మంది ఆంధ్రా సోదరులు ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వారి పెట్టుబడులు, భవిష్యత్తు, వారికొస్తున్న రాబడులు.. అన్నీ బాగుండాలంటే.. హైదరాబాద్లో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలి. రాజకీయ గొడవల్లో తలదూర్చకూడదు. అందుకే తటస్థంగా ఉండాలని మేం ఓ నిర్ణయానికొచ్చాం. మా పార్టీకి ఈ విషయంతో సంబంధం లేదు. ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలి’’ అని కేటీఆర్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎంపీలకు మిశ్రమ ఫలితాలు
లోక్సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్గా పరిగణించే నాలుగు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సవాల్గా తీసుకున్న భాజపా.. గెలుపు లక్ష్యంగా సర్వశక్తులొడ్డింది. -
దివ్యాంగుల పింఛన్ల మంజూరులో పక్షపాతం: పవన్కల్యాణ్
తమ పక్షం కాని దివ్యాంగులకు పింఛన్ల మంజూరు విషయంలో వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఇలాగే..: జైరాం
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తు చేసుకున్నారు. -
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది
రాష్ట్రాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించాలని అప్పన్నస్వామిని కోరుకున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. దుష్టశక్తులపై పోరాడే బలాన్ని ఇవ్వాలని ప్రార్థించానన్నారు. -
భాజపాను ప్రజలు ఆశీర్వదించారు: పురందేశ్వరి
కేంద్రంలో భాజపా సుపరిపాలనను మెచ్చి మూడు రాష్ట్రాల్లో ప్రజలు పట్టం కట్టి ‘ఇండియా’ కూటమికి ప్రజలు బుద్ధి చెప్పారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
‘గ్యారంటీ’లు అమలు చేయడంతోనే కాంగ్రెస్ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయంలో మా నేతల కృషి, ప్రభుత్వ గ్యారంటీ పథకాల ప్రభావం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. -
భాజపా విజయం భవిష్యత్తుకు దిక్సూచి
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం భవిష్యత్తు ఫలితాలకు దిక్సూచిగా నిలవనుందని జనసేన అధినేత వపన్కల్యాణ్ పేర్కొన్నారు. -
తెలంగాణలో విజయంపై ఏపీ కాంగ్రెస్ సంబరాలు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కృషితోనే ఆ రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. -
ఏపీలో జగన్నూ ఓడించాలి: తులసిరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆదివారం వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. -
ఆంధ్రాపై తెలంగాణ ఫలితాల ప్రభావం
తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం.. ఆంధ్రాపై తప్పక ప్రభావం చూపుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. -
రాష్ట్రానికి జగన్ వద్దనడానికి సవాలక్ష కారణాలున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ
‘‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు కొత్తగా ‘ఏపీ నీడ్స్ జగన్’ అంటూ ప్రజల్లోకి రావడం సిగ్గుచేటు. -
వ్యక్తిగత భద్రతపై పోలీసులు స్పష్టత ఇవ్వాలి
తన వ్యక్తిగత భద్రతపై జిల్లా పోలీసు యంత్రాంగం స్పష్టతనివ్వాలని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ బీటెక్ రవి పోలీసులను ప్రశ్నించారు. -
Nara Lokesh: దళితుల్ని ఇబ్బందిపెట్టే వైకాపాను గద్దె దించుదాం
‘‘జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయి. దళితసంఘాలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడనివ్వట్లేదు. -
తెదేపా నేత డూండీ రాకేష్ అరెస్టు.. విడుదల
తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ను విజయవాడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
భాజపా, కాంగ్రెస్లకు శుభాకాంక్షలు తెలిపిన జగన్
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపాకి, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
Mizoram Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ
-
Upcoming Telugu Movies: ఈవారం థియేటర్/ఓటీటీల్లో.. అలరించే సినిమాలు, సిరీస్లివే
-
తూప్రాన్లో కూలిన శిక్షణ హెలికాప్టర్.. ఇద్దరి మృతి?
-
Cyclone Michaung: గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
-
Stock Market: సూచీల్లో ఎన్నికల ఫలితాల జోష్.. 20,500 పైకి నిఫ్టీ
-
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్