ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం?
ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలతో.. తెలంగాణకు సంబంధమేంటని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
అది రెండు పార్టీల రాజకీయ ఘర్షణ
చంద్రబాబు అరెస్టయింది ఏపీలో.. ధర్నాలు చేయాల్సిందీ ఆ రాష్ట్రంలోనే
లోకేశ్, జగన్, పవన్ ముగ్గురూ నాకు స్నేహితులే: కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలతో.. తెలంగాణకు సంబంధమేంటని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఏపీ రాజకీయాలు, చంద్రబాబు అరెస్టుపై కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల ఘర్షణ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అరెస్టయింది ఆంధ్రప్రదేశ్లో. ధర్నాలు చేయాల్సింది ఆ రాష్ట్రంలోనే. నిర్మొహమాటంగా చేయండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఒకరు ర్యాలీలు తీస్తారు. ఇంకోరోజు ఇంకొకరు తీస్తారు. మరి మేం ఏం చేయాలి? పక్కింటి పంచాయితీని ఇక్కడ తేల్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో ఒకరితోఒకరు తలపడండి. రాజమహేంద్రవరంలో భూమి దద్దరిల్లిపోయేలా ర్యాలీలు తీయండి. మాకేం సంబంధం? వాళ్ల వాళ్ల పంచాయితీలు తెచ్చి హైదరాబాద్లో పెడతామంటే ఎలా? మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఎలా అనుమతిస్తాం? ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. సున్నితమైన అంశం అనుకున్నప్పుడు.. సున్నితంగానే వ్యవహరించాలి. రోజూ రన్నింగ్ కామెంటరీ లాగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయస్థానంలో విషయం ఉన్నప్పుడు.. ఎవరు పడితే వారు రోడ్డు మీదికొచ్చి కామెంట్లు చేయొచ్చా? నాకు లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్ స్నేహితులే. ఏపీతో మాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిందేమీ లేదు. వాళ్లకు కూడా ఇక్కడేమీ ఇష్యూస్ లేవు. అలాంటప్పుడు మాకూ మాకూ మధ్య లేనిపోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారు?
అంతా కలిసిమెలిసి ఉంటున్నారు
హైదరాబాద్లో ఆంధ్రా, రాయలసీమ, కేరళ, పంజాబ్.. ఇలా అన్ని ప్రాంతాలకు చెందినవారు కలిసిమెలసి ఉంటున్నారు. ఆంధ్రా ప్రజలు ఇక్కడ గత పదేళ్లుగా సుఖంగా, సుభిక్షంగా ఉన్నారు. వాళ్లనెందుకు ఇబ్బంది పెట్టడం? వాళ్ల మధ్య వైషమ్యాలు, రాజకీయ కక్షలు లేపి, వాటిని మాకు లేదా ఇంకొకళ్లకు చుట్టి.. దాన్నుంచి ఇంకేదో సాధిద్దామనుకుంటే.. అదెలా కరెక్టు అవుతుంది? లోకేశ్ ఒక స్నేహితుడి ద్వారా మాట్లాడించారు.. ‘ధర్నాలకు అనుమతి ఇవ్వాలి’ అని కోరారు. దానికి నేను ఒక్కటే సమాధానమిచ్చా.. ‘బ్రదర్.. ఇవాళ మీరు చేస్తారు.. రేపు మీకు పోటీగా మరొకరు చేస్తారు. అప్పుడు హైదరాబాద్లో శాంతిభద్రతలు ఏం కావాలి? ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆందోళనలు చేయలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో.. అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు’ అని వివరించా. ఇవాళ ఎంతో మంది ఆంధ్రా సోదరులు ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వారి పెట్టుబడులు, భవిష్యత్తు, వారికొస్తున్న రాబడులు.. అన్నీ బాగుండాలంటే.. హైదరాబాద్లో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలి. రాజకీయ గొడవల్లో తలదూర్చకూడదు. అందుకే తటస్థంగా ఉండాలని మేం ఓ నిర్ణయానికొచ్చాం. మా పార్టీకి ఈ విషయంతో సంబంధం లేదు. ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలి’’ అని కేటీఆర్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ