పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు.
ఈనాడు డిజిటల్, అమరావతి: మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో అధినేత పవన్కల్యాణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి డీసీసీబీ మాజీ ఛైర్మన్, ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన మైలవరపు గోపాలకృష్ణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటి కిరణ్, వైకాపా సీనియర్ నాయకుడు మంద శ్రీనివాసరెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ నాయకుడు ముత్యాల బాలాజీ, అమలాపురానికి చెందిన సీనియర్ కాపు నాయకుడు నల్లా సూర్యచంద్రరావు కుమారులు అజయ్, సంజయ్ కూడా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
బీఫాం పొందిన నిమ్మక జయకృష్ణ
పాలకొండ అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నుంచి బీఫాం స్వీకరించారు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరికీ బుధవారమే బీఫాంలు అందించగా, వ్యక్తిగత కారణాల వల్ల జయకృష్ణ రాలేకపోయారు. ఆయనకు గురువారం బీఫాం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం