రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
చంద్రబాబు, పవన్కల్యాణ్తో కలిసి ఉమ్మడిగా ప్రచారం
ఈనాడు, అమరావతి: ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్తో కలసి ఆయన సభల్లో పాల్గొంటారు. అనకాపల్లి, రాజమహేంద్రవరం, కడప లేదా రాజంపేట, మూడు పార్టీలు ఎంపిక చేసిన మరో చోట ఈ సభలు ఉంటాయని తెదేపా వర్గాలు తెలిపాయి. అయితే తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఈ నెల 23న నెల్లిమర్ల, విజయనగరం, 24న రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో సంయుక్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చంద్రబాబు ఈ నెల 19న ఆలూరు, రాయదుర్గం, 20న గూడూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 21న ఆయన జగ్గంపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉండగా.. అదే రోజు అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నందున నర్సీపట్నం సభ వాయిదా పడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం