అయిదుగురు ముఖ్యమంత్రుల రాక
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు అయిదుగురు భాజపా ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు. వీరిలో నలుగురు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇందులో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
ఈనాడు, హైదరాబాద్: జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు అయిదుగురు భాజపా ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్నారు. వీరిలో నలుగురు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇందులో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టులో దిగారు. హైదరాబాద్కు చేరిన హిమాచల్ప్రదేశ్ సీఎం జయరామ్ ఠాకూర్, త్రిపుర సీఎం మాణిక్ సాహు, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, మణిపూర్ సీఎం బీరేన్సింగ్లకు ఎయిర్పోర్టు ప్రొటోకాల్ కమిటీ ఇన్ఛార్జి తూళ్ల వీరేందర్గౌడ్ స్వాగతం పలికారు.
భారతీయులుగా గర్వపడాలి
జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్రిజిజు హైదరాబాద్లోని ఈశాన్యరాష్ట్రాల ప్రజలతో శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. దేశ చరిత్రలో కేంద్ర మంత్రివర్గంలో ఎప్పుడు లేనంత ప్రాధాన్యం మోదీ ప్రభుత్వంలో దక్కిందన్నారు. మనమంతా ఒక దేశస్తులమేనని, భారతీయులుగా గర్వపడాలని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!