అయిదుగురు ముఖ్యమంత్రుల రాక

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు అయిదుగురు భాజపా ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో నలుగురు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇందులో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

Updated : 02 Jul 2022 06:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు అయిదుగురు భాజపా ముఖ్యమంత్రులు శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో నలుగురు ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఇందులో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగారు. హైదరాబాద్‌కు చేరిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జయరామ్‌ ఠాకూర్‌, త్రిపుర సీఎం మాణిక్‌ సాహు, అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండు, మణిపూర్‌ సీఎం బీరేన్‌సింగ్‌లకు ఎయిర్‌పోర్టు ప్రొటోకాల్‌ కమిటీ ఇన్‌ఛార్జి తూళ్ల వీరేందర్‌గౌడ్‌ స్వాగతం పలికారు.

భారతీయులుగా గర్వపడాలి

జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన కేంద్ర మంత్రి కిరణ్‌రిజిజు హైదరాబాద్‌లోని ఈశాన్యరాష్ట్రాల ప్రజలతో శుక్రవారమిక్కడ సమావేశమయ్యారు. దేశ చరిత్రలో కేంద్ర మంత్రివర్గంలో ఎప్పుడు లేనంత ప్రాధాన్యం మోదీ ప్రభుత్వంలో దక్కిందన్నారు. మనమంతా ఒక దేశస్తులమేనని, భారతీయులుగా గర్వపడాలని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని