మీ దోపిడీలను, దందాలను వెలికితీస్తే చంపేస్తారా?

వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిపైనా, అధికార పార్టీ నాయకుల అవినీతిని వెలికితీసిన పాత్రికేయులపైనా వైకాపా రౌడీలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Published : 27 Sep 2022 04:57 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజం

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన వారిపైనా, అధికార పార్టీ నాయకుల అవినీతిని వెలికితీసిన పాత్రికేయులపైనా వైకాపా రౌడీలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఒక పత్రిక విలేఖరి చంద్రమోహన్‌పై మంత్రి గుమ్మనూరు జయరామ్‌ వర్గీయులు దాడి చేయడాన్ని తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘పట్టపగలు వాహనంతో అడ్డగించి చంపేందుకు ప్రయత్నించారంటే వైకాపా గూండాలు ఎంతగా బరితెగించి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. మంత్రి జయరాం ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో పేకాట, మట్కా, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించడంతో పాటు, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం స్మగ్లింగ్‌ చేసి ఏరులై పారిస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు తెలిసిన నగ్నసత్యాలు. వాటిపై వార్తలు రాస్తే చంపుతారా? వైకాపా నేతల దందాలు, భూకబ్జాలు, దోపిడీలపై వార్తలు రాయకూడదా’ అని అచ్చెన్న మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని