కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని రేవంత్‌ అనలేదు: మల్లు రవి

మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనలేదని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Published : 27 Sep 2022 05:54 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనలేదని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తెరాసకు మద్దతుపై పునరాలోచన చేయాలని మాత్రమే ఆయన సూచించారన్నారు. ఈ విషయంలో సీపీఐ, సీపీఎం నాయకులు రేవంత్‌ విషయంలో పొరబడుతున్నారని, వారిని కించపరిచే ఉద్దేశం ఆయనకు లేదని తెలిపారు. కాంగ్రెస్‌- కమ్యూనిస్టులు సహజ మిత్రులని, వందల ఏళ్ల పోరాట చరిత్ర కమ్యూనిస్టులది అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని