Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు: చంద్రబాబు
స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఆస్తుల దోపిడీయే గానీ.. తరాల మధ్య ప్రేమలను జగన్ పట్టించుకోరు. అలాంటి వ్యక్తి కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైంది. పూర్తి కథనం
2. కేశినేని నాని ముందే చేతులెత్తేశారు: కేశినేని చిన్ని
పోలింగ్కు ముందే విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతులెత్తేశారని ఆయన సోదరుడు, తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. రాజధానిగా అమరావతి వద్దన్న నానికి ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని చెప్పారు. ఎంపీగా పోటీ చేసే నైతిక అర్హత కూడా ఆయనకు లేదన్నారు.పూర్తి కథనం
3. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి కథనం
4. పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. మొన్న భారతీయుల రూపురేఖలపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) మరోసారి పార్టీని ఇరుకునపడేశారు.పూర్తి కథనం
5. కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారు: హరీశ్రావు
కాంగ్రెస్ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్కు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారని.. 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. పూర్తి కథనం
6. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలే వదిలేస్తా: భాజపా ఎంపీ అర్వింద్
ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని భాజపా ఎంపీ అర్వింద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలు ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరింది. పూర్తి కథనం
7. ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
దిల్లీ మద్యం కుంభకోణం (Delhi Excise Policy Scam Case) కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్లను నిందితులుగా ప్రస్తావించనుంది. ఈ దర్యాప్తు సంస్థ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చినట్లవ్వనుంది.పూర్తి కథనం
8. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) అభ్యంతరక వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని సదరు మహిళ వెల్లడించిందని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.పూర్తి కథనం
9. కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ వస్తున్నారా..? బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్ వర్గాలు. ప్రస్తుతం ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్గా ఉన్న ద్రవిడ్ను టీ20 ప్రపంచ కప్ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది.పూర్తి కథనం
10. కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే: బండి సంజయ్
భారాస ప్రభుత్వంలో కేసీఆర్ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే అని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని.. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఇక్కడి నేతన్నల దుస్థితికి వాళ్లిద్దరే కారణమన్నారు. పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. -
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడటమే తన మొదటి లక్ష్యమన్నారు. -
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
కిర్గిజ్స్థాన్ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్లోని భారత రాయబారితో మాట్లాడారు. -
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపుతున్నాయి. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. -
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. సిట్ నివేదికలో కీలక అంశాలు!
ఏపీలో ఎన్నికల వేళ 33చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించామని సిట్ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. -
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈసీ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. -
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ కొత్త నియామకాలు చేపట్టింది. -
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 22వ తేదీ నాటికి ఒక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ను దిల్లీలోని ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ: బత్తిని కుటుంబ సభ్యులు
చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 ఉదయం 11 నుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణ ఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్
Telangana ECET Results: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ (TG ECET Results) ఫలితాలు విడుదలయ్యాయి. -
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. అభ్యర్థుల రాకతో వివిధ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలం దేవస్థానంలో భక్తుల నుంచి అదనంగా టికెట్ రుసుం వసూలు చేస్తున్నారు. అభిషేక కర్తలతోపాటు అదనంగా వచ్చే వారికి టికెట్ రేటు పెంచి విక్రయిస్తున్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
బతుకుజీవుడా..
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
నాణ్యతే ప్రామాణికం.. అవగాహనే కీలకం
రోజువారీ జీవితంలో లెక్కలు, కొలతలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉదయం లేచిన వెంటనే తాగే నీటి నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు తీసుకునే ఆహార పదార్థాలు, వినియోగించే పరికరాల నాణ్యతపైనే మన కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్