Munugode Bypoll: మంత్రితో ఫొటో.. ఫ్రేమ్‌ కట్టి ఇంట్లో..

మునుగోడు ఉపఎన్నికలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

Updated : 13 Oct 2022 07:06 IST

ఉపఎన్నికలో ఎర్రబెల్లి వినూత్న ప్రచారం

చండూరు, న్యూస్‌టుడే: మునుగోడు ఉపఎన్నికలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని చండూరు పురపాలికకు తెరాస ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉన్న ఎర్రబెల్లి  రెండు, మూడు రోజులుగా ప్రచారం ముమ్మరం చేశారు. ఇంటింటికీ వెళ్లి తెరాసకు ఓటేయాలని కోరుతూ.. ప్రతి ఓటరు కుటుంబంతో గ్రూప్‌ ఫొటో దిగుతున్నారు. తర్వాత ఆ ఫొటోలను ప్రింట్‌ తీసి.. ఫ్రేములు కట్టించి.. కార్యకర్తలతో పంపిణీ చేయిస్తున్నారు. దీంతో మంత్రి ప్రచారం ఓటర్లకు ఓ జ్ఞాపకంగా ఉండడంతో పాటు పార్టీకి లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని