Ghulam Nabi Azad: రాహుల్ వల్లే పార్టీ నాశనం.. నా రాజీనామాకు ఆయన తీరూ కారణమే..!
తాను పార్టీని వీడడానికి రాహుల్ గాంధీ తీరు కూడా ఓ కారణమంటూ గులాంనబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు.
అధ్యక్షురాలికి రాసిన లేఖలో మండిపడ్డ ఆజాద్
దిల్లీ: ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గులాంనబీ ఆజాద్(Ghulam Nabi Azad).. చివరికి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి లేఖ రాసిన ఆయన.. తాను పార్టీని వీడడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీరు ఓ కారణమంటూ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ (Sonia Gandhi) ఉన్నప్పటికీ.. రాహుల్ గాంధీ అనుచరులే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని దుయ్యబట్టారు. రాజీనామా (Resignation) లేఖలో రాహుల్ గాంధీ తీరును ఆజాద్ ప్రధానంగా ప్రస్తావించారు.
2013లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి పార్టీని ఆయన నడిపిన తీరుపై ఆజాద్ విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్ నేతలను పక్కనబెట్టి.. కేవలం పీఏలు, సెక్యూరిటీ గార్డులు, కోటరీల సలహాలతోనే ఆయన కీలక నిర్ణయాలు తీసుకునేవారని మండిపడ్డారు. వారితోనే పార్టీని నడపడం మొదలుపెట్టారని.. తద్వారా పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిందని రాహుల్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇక పార్టీలో సోనియాగాంధీ పాత్ర నామమాత్రమేనని.. రిమోట్ కంట్రోల్ మోడల్లో పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయని విమర్శించారు.
రాహుల్ గాంధీపై ఆజాద్ చేసిన విమర్శల్లో కొన్ని..
* రాహుల్ గాంధీది చిన్నపిల్లల మనస్తత్వం
* ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులను చింపివేయడం ఆయన అపరిపక్వతకు నిలువెత్తు నిదర్శనం
* 2014లో పార్టీ ఓటమి చెందడానికి రాహుల్ తీరే కారణం
* పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంలోనూ రాహుల్ తీరు బాగాలేదు
* పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా నాశనం చేశారు
* సీనియర్ నాయకులందర్నీ రాహుల్ పక్కనబెట్టారు
* అనుభవం లేని వ్యక్తులతో కోటరీని ఏర్పాటు చేసుకొని పార్టీని నడిపిస్తున్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా