మంత్రి పదవి ఎప్పుడు..? కేటీఆర్‌, రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది.

Published : 08 Feb 2024 14:08 IST

హైదరాబాద్‌: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య అసెంబ్లీ లాబీలో ఆసక్తికర చర్చ జరిగింది. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్‌ను కేటీఆర్‌ అడగ్గా..  ‘‘మీలాగే తమకూ ఫ్యామిలీ ఎఫెక్ట్‌ పడుతుంది’’ అని ఆయన జవాబిచ్చారు. ‘‘ఫ్యామిలీ పాలన కాదు.. బాగా పనిచేస్తే కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. ఎంపీగా మీ కుమార్తె కీర్తి పోటీ చేస్తారా? కుమారుడు సంకీర్త్‌ పోటీ చేస్తారా?’’ అని కేటీఆర్‌ అడిగారు. దయచేసి తనను వివాదాల్లోకి లాగవద్దని రాజగోపాల్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని