JP Nadda: భారాసతో రాజీలేదు.. సీరియస్‌ ఫైటే: జేపీ నడ్డా

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఘనస్వాగతం పలికారు.

Updated : 25 Jun 2023 14:32 IST

హైదరాబాద్‌: నేతలంతా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. పార్టీ లైన్‌ దాటి ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నడ్డాకు రాష్ట్ర భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన నేరుగా నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు రఘునందన్‌రావు, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌రావు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో నడ్డా చర్చిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని నడ్డా హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారాసతో రాజీలేదని.. ఆ పార్టీతో సీరియస్‌ ఫైట్‌ ఉంటుందని నడ్డా స్పష్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని