Jupally Krishna Rao: కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి

మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated : 03 Aug 2023 15:20 IST

దిల్లీ: మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజేశ్‌రెడ్డి, కొడంగల్‌ మున్సిపల్ ఛైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కొడంగల్‌ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ కాంగ్రెస్‌లో చేరారు. 

వీరితో పాటు వనపర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి.. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ నాగరాజు తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నేతలు మల్లు రవి, సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 35 చోట్ల ఏం చేద్దాం?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు