KA PAUL: గద్దర్ను భయపెట్టారు.. దీంతో అభ్యర్థిగా నేనే నామినేషన్ వేశా: కేఏ పాల్
తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు.
చండూరు, న్యూస్టుడే: తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. నామినేషన్ వేయకున్నా తన పాట ద్వారా మద్దతు ఉంటుందని ఆయన తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం కేఏ పాల్ చండూరులో విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ వేసేందుకు ఇక్కడికి రాకుండా తనకు అధికారులు అడ్డంకులు సృష్టించారని, అయినా వచ్చినట్లు తెలిపారు. పాలకుల నిర్లక్ష్యంతో ఈ నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని, ఇక్కడి ప్రజలు తనను గెలిపిస్తే మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా ఏకం కావాలని పాల్ పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..