Karnataka Elections: కాంగ్రెస్ నేతలారా.. ప్రజల మనసులు గెలుచుకోండి: కపిల్ సిబల్
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) విజయం సాధించిన కాంగ్రెస్ నేతలు ఐదేళ్లపాటు ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆ పార్టీ మాజీ నేత కపిల్ సిబల్ ఆకాంక్షించారు.
దిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నేత కపిల్ సిబల్ (kapil Sibal) స్పందించారు. రానున్న ఐదేళ్లపాటు కాంగ్రెస్ (Congress) పార్టీ నిజాయితీగా పని చేసి, ఎలాంటి వివక్ష చూపకుండా ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో విజయం సాధించడం కష్టం. ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం ఇంకా కష్టం. అందుకే రానున్న ఐదేళ్లపాటు నిజాయితీగా, వివక్ష లేకుండా పాలన సాగించండి. భాజపా ఇలా చేయలేకపోవడం వల్లే పరాజయం పాలైంది’’ అని కపిల్ సిబల్ ట్విటర్లో పేర్కొన్నారు.
మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నప్పుడు కూడా కపిల్ సిబల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘ ప్రధాని ఓడిపోయారు.. కర్ణాటక ప్రజలు విజయం సాధించారు. 40శాతం కమీషన్కు, కేరళ స్టోరీకి, విభజన రాజకీయాలకు, అహంకారానికి కన్నడ ప్రజలు ‘నో’ చెప్పారు.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో కపిల్ సిబల్ కేంద్ర మంత్రిగా పని చేశారు. గతేడాది మేలో కాంగ్రెస్ను వీడి..సమాజ్వాదీ పార్టీ మద్దతులో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం