Kejriwal: ఉత్తరాఖండ్ ప్రజలు ఉచిత విద్యుత్ పొందలేరా?
ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంపై దిల్లీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్గా దృష్టిసారించారు......
దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించడంపై దిల్లీ సీఎం, పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీరియస్గా దృష్టిసారించారు. ఇటీవల గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నారు. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనకు ముందు రోజు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఉత్తరాఖండ్ విద్యుత్ను ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ.. అక్కడి ప్రజలకు మాత్రం విద్యుత్ ఖరీదుగా మారిపోయిందని విమర్శించారు. దిల్లీలో ఉచిత విద్యుత్ అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
‘‘ఉత్తరాఖండ్ విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకూ విక్రయిస్తోంది. మరి అలాంటప్పుడు, ఉత్తరాఖండ్ ప్రజలకు విద్యుత్ ఎందుకంత ఖరీదుగా మారింది? దిల్లీ సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేయకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి మరీ దేశ రాజధాని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం. ఉత్తరాఖండ్ ప్రజలు ఉచిత విద్యుత్ పొందలేరా? దేహ్రాదూన్లో రేపు కలుద్దాం..’ అని ట్విటర్లో పేర్కొన్నారు.
ఇటీవల పంజాబ్ పర్యటన సందర్భంలోనూ కేజ్రీవాల్ ఉచిత విద్యుత్ అంశాన్నే ప్రధానంగా లేవనెత్తారు. వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి అధికారం అప్పగిస్తే గృహ అవసరాల కోసం 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 24గంటల పాటు విద్యుత్ అందిస్తామన్నారు. ఇది కేజ్రీవాల్ మాట.. అమరీందర్ సింగ్లా బడాయి ప్రతిజ్ఞ కాదు’’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దిల్లీలో వరుస విజయాలతో సత్తా చాటిన కేజ్రీవాల్.. ఇప్పుడు మరికొన్ని రాష్ట్రాల్లో తన ముద్ర వేయాలనే సంకల్పంతో వ్యూహాలు రచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434